ఈ రోజు తెలంగాణలో పదవ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.  కరోనా ఎఫెక్ట్ తో విద్యార్థులుకు తగు జాగ్రత్తలు చెప్పి పరీక్ష హాల్ కి పంపుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు.  ఈ  మద్య ప్రభుత్వ అధికారులు కొంత మంది చేస్తున్న చిత్రమైన పనుల వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు.  ముఖ్యంగా ఓటర్ లీస్ట్, హాట్ టికెల్ విషయాల్లో ఒకరి బొమ్మలకు బదులు వేరే వారి బొమ్మలు పెట్టి ప్రింట్ తీయడం చూస్తున్నాం.  ఆ మద్య ఓటరు లీస్ట్ లో తన బొమ్మకు బదులు ఏకంగా కుక్క బొమ్మ ప్రింట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. స్టూడెంట్ పేరు హిదయత్ పబ్​జీ, తండ్రి పేరు తాహెర్ పబ్​జీ లైట్, తల్లిపేరు రేష్మా ఫాతిమా… స్టూడెంట్ ఫోటో ప్లేస్ లో  పబ్జీ బొమ్మ… ఇది  బుధవారం టెన్త్​ హాల్​టికెట్​లో దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోారు.

 

ఓ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యంతో  లేని విద్యార్థి పేరుతో ఈ హాల్​టికెట్ బయటకొచ్చింది. హైదరాబాద్​జిల్లాలోని షాలిబండలోని‘ఎస్​’ ది స్కూల్ లో 43 మంది విద్యార్థులున్నారు. కానీ మేనేజ్మెంట్ 44 మంది ఉన్నట్టు అధికారులకు వివరాలు పంపించింది.  అయితే యాజమాన్యం పంపిన వివరాల ప్రకారం ఈ నామినల్ రోల్స్ లో ఏమైనా తప్పులున్నాయా? అని అధికారులు తిరిగి మేనేజ్మెంట్​ను ప్రశ్నించినా అన్ని సక్రమంగానే ఉన్నాయని సమాధానం ఇచ్చారంటూ అధికారులు చెప్తున్నారు.   

 

అయితే హాల్ టికెట్ లో మాత్రం హాల్​టికెట్(2022114399)ను స్కూల్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు.  అయితే దీనిపై  ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విచారణ చేపట్టారు. అసలు హిదయాత్ పేరుతో స్టూడెంట్ ​లేరని గుర్తించారు.  ‘ఎస్​’ ది స్కూల్ మేనేజ్మెంట్​పై చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి.  అయితే తప్పుగా వచ్చిన హాల్ టికెట్ ను స్వాధీనం చేసుకున్నామని...  వెబ్​సైట్​నుంచి హాల్​టికెట్​ను తొలగించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: