దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో మొత్తంగా 166 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో  రోజురోజుకీ ప్రజల్లో ప్రాణభయం పెరిగిపోతుంది. టిఆర్ఎస్ కు సరైన విరుగుడు కూడా లేకపోవడంతో.. ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక రోజు రోజుకు కరోనా  వైరస్ దేశంలో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టింది.. ఈ నేపథ్యంలోనే భారత్ మొత్తం దిగ్బంధనం దిశగా అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశవ్యాప్తంగా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలను  అన్నింటినీ మూసివేయాలంటూ  కీలక ఆదేశాలు జారీ చేసింది. 

 

 

 అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర పరిధిలో కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు దిగ్బంధనం లోకి వెళ్లి పోయాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు పాతుకు  పోతున్నాయి. అయితే కరోనా  నియంత్రణకు సంబంధించి పార్లమెంటు ఎదుట కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నియంత్రణకు ఓ సలహా ఇచ్చారు ఆయన. 

 

 

 కరోనా  వైరస్ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి తొందరగా సంక్రమిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారి పోయాయి.ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా సూర్యరశ్మి తమపై ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. సూర్యరశ్మి మనకు విటమిన్ డి ని అందిస్తుంది అంటూ తెలిపారు ఆయన. ఇక ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు సూర్యరశ్మి తమపై ఉండేలా చూసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన వైరస్ లను కూడా అంతం చేసే శక్తి మనిషికి ఉంటుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: