చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరించి చావుదెబ్బ కొడుతోంది. కొన్ని దేశాలలో విలయ తాండవం చేస్తూ మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికి కరోనా దెబ్బకు మృత్యువాత పడిన వారు చాల మందే ఉన్నారని చెప్పవచ్చు. అయితే.. కరోనా భారత్ లో కూడా వేగంగా విస్తరించడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 7 గురుకి కరోనా సోకగా., ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరికీ కరోనా ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా పాఠశాలలను, కళాశాలలను మూసివేయించారు. అయితే.. ప్రస్తుతానికి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు కావటంతో భయాందోళనకు గురవుతున్నారు.

 

దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా కూడా పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయన్నారు. ఇప్పుడు పదవ తరగతి పరీక్షల నిర్వహణపై, కరోనా వైరస్ వలన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మంత్రులు, అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. ఏపీలో పరీక్షల అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించి పరీక్షల నిర్వహణ పై కీలక ప్రకటన చేశారు. 

 

కరోనా వైరస్‌ అదుపుచేయటంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలూ తీసుకుంటోందని., అందులో భాగంగానే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. అలాగే వాటితో పాటుగా వైద్య, నర్సింగ్ కాలేజీలకు ఈ నెల 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. సెలవుల్లో ఆన్‌ లైన్ క్లాసులకు అనుమతి ఉంటుందని తెలిపారు.  సెలవలు ఇచ్చినందున విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మరోవైపు ఈ నెల 23 నాటికి ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. అలాగే మార్చి 31 నుంచి టెన్త్‌ పరీక్షలు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామన్నారు. ఒకవేళ విద్యార్థులకు జలుబు, దగ్గు ఉంటే వారికి ప్రత్యేక రూమ్‌ లో పరీక్షలు నిర్వహిస్తామని అలాగే హాస్టల్ లో ఉండే విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసి అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: