నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు రూటు చాలా సపరేటు. వైసిపి ఎంపీలంతా ఒక దారిలో వెళితే ఆయన దారి రహదారి అన్నట్టు వెళ్తారు. చాలా సందర్భాలలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం గురించి రఘురామకృష్ణంరాజు తెలుగును అగౌరవపరిచే ఈ విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు వార్తల్లో హైలెట్ గా నిలిచారు. జగన్ పార్టీని వీడుతున్నట్లు ఇలా రకరకాలుగా అప్పట్లోనే వార్తలు రావడం జరిగింది. అంతేకాకుండా ఆ సమయంలో బిజెపి పార్టీలోకి వెళ్తున్నట్లు ఇలా అనేక రకాలుగా ఆయనపై ప్రచారం జరిగింది. పార్లమెంటులో కూడా రఘురామకృష్ణంరాజు మాట్లాడే ప్రతీ మాటకు కాస్త ప్రాధాన్యత ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

 

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో… విభేదాలు తలెత్తగా ఆయన వాటిని పరిష్కరించారు. అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్తుండగా… జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలని అరుస్తుండగా… రఘురామకృష్ణంరాజుకు ఒక్కసారిగా కోపం వచ్చి… ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలని సూచించారు.

 

దీంతో ఆ నినాదా లు చేస్తున్న వైసీపీ కార్యకర్తలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు కి వార్నింగ్ ఇస్తున్నారు. చాలా సార్లు నాలుక జారింది ఈసారి జారితే ఊరుకునే ప్రసక్తి లేదు మీడియా ముందు అది కార్యకర్తల దగ్గర ఏంటా మాటలు అంటూ సోషల్ మీడియాలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై కౌంటర్లు వైసీపీ కార్యకర్తలు వేస్తున్నారు. మరోపక్క పార్టీలో ఉన్న నాయకులు ఆయనపై అత్యవసర చర్యలు తీసుకోవాలని హైకమాండ్ కి రిపోర్ట్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: