కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి వారి పాలిట కాలయముడయ్యాడు. కూతురు చేసిన పని సహించలేని తండ్రి ఏకంగా అతి దారుణంగా వారిని చంపేశాడు. రోజురోజుకు అసలు సమాజం తీరు  ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మనిషి ప్రాణాలకు ఎక్కడ కొంచమైనా విలువ కనిపించడం లేదు. అతి దారుణంగా హత్యలు  చేసేస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఇక్కడ ఒక తండ్రి ఇలాంటిదే చేశాడు... కూతుళ్లు  చేసిన చిన్న తప్పుకు క్షణికావేశంలో తండ్రి ఏకంగా ఇద్దరు కూతుళ్లను దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... కూతుర్లు దొంగతనం చేశారు కారణంతో కోపం తో ఊగిపోయిన కన్న తండ్రి ఇద్దరు కూతుళ్లను దారుణంగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని దారపు గ్రామంలో సుఖ్ దివో శర్మ తన ఇద్దరు కూతుర్లు అనామిక(18)  నేహా (20) లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇక అక్కడే స్థానికంగా జరిగే హోలీమిలాన్ వేడుకల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో ఓ వ్యక్తి మొబైల్ చోరీకి గురైంది. ఇక ఈ వేడుకల్లో ఉన్న వారందరూ ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానించారు. వారే మొబైల్ దొంగలించి ఉంటారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు అక్క చెల్లెల పై తండ్రికి ఫిర్యాదు చేశారు స్థానికులు. 

 

 

 ఇక తండ్రిసుఖ్ దివో  శర్మ తన ఇద్దరు కూతుళ్లను తనిఖీ చేయగా... మొబైల్ బయటపడింది. దీంతో తన కూతుర్లు దొంగతనం చేయడానికి జీర్ణించుకోలేకపోయాడు తండ్రి. అందరి ముందు పరువు పోయింది అని భావించి కోపంతో ఊగిపోయాడు. ఇక తీవ్ర కోపోద్రిక్తుడైన తండ్రి అక్కడే ఉన్న తుపాకీతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కూతుళ్లను దారుణంగా కాల్చాడు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే కుప్పకూలిపోయి  మృతి చెందారు. ఇక కూతుళ్లను హత్యచేసి అనంతరం తండ్రి ఎస్పీ అజయ్ కుమార్ ఎదుట లొంగిపోయాడు. అయితే నిందితుడు బేల్దారి పనులు చేస్తూ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు అంటూ ఈ సందర్భంగా ఎస్పీ  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: