న్యాయవాదిగా ఉంటూ అన్యాయానికే సపోర్టు చేస్తూ ఏడు సంవత్సరాల పాటు అందరి చేత ఛీ కొట్టించుకున్న ఏపీ సింగ్ మరోసారి తన నీచమైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. నిర్భయపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుంటే ఎంత కఠినాత్ముడైన కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గులు భూమ్మీద బతకడానికి అర్హత లేదని తెలిసి కూడా ఏపీ సింగ్ వారి తరుఫున మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇప్పటివరకు అతను నిర్భయ కేసు ద్వారా న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టి చట్టసవరణలు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని పరోక్షంగా తెలియజేస్తున్నాడేమోనని చాలా మంది అతన్ని కొనియాడారు. కానీ కేసు ఓడిపోయిన తరువాత అతడు నిర్భయ పై చేసిన వాక్యాలు వింటుంటే ఎవరికైన అతన్ని అక్కడే పట్టుకొని పిచ్చ కొట్టుడు కొట్టాలనిపిస్తుంది.




ఇంతకీ సదరు న్యాయవాది మీడియా ముందు ఏమన్నాడంటే... ' నిర్భయ రాత్రి 12:00 గంటల వరకు ఎందుకు ఒక మగ వ్యక్తి తో బయట తిరుగుతుందో తన తల్లిని చెప్పమనండి. ఆమెకు తెలియదు తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో అనేది కూడా.' అంటూ నిర్భయ క్యారెక్టర్ ని తప్పు పడుతూ మధ్య వేలిని ఎత్తి చూపించాడు. దాంతో ఆయన మాటల్ని విన్న చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టిపోశారు.





వాస్తవానికి రాత్రి సమయంలో బయటకు వచ్చిన ప్రతి మహిళని మానభంగం చేయోచ్చనట్టు మాట్లాడుతున్నాడు ఏపీ సింగ్. ఇటువంటి మనస్తత్వం ఉన్న ఏపీ సింగ్ రేపిస్టుల కంటే ప్రమాదకరమని, పనిలో పని ఇతన్ని కూడా నలుగురితో ఉరి తీసినట్టు అయితే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  ఎంతైనా న్యాయ చరిత్రలో న్యాయాన్ని అమ్ముకునే ఇటువంటి నీచమైన న్యాయవాదిని ఎవరు చూసి ఉండరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: