నిర్భయ దోషులకు ఉరి శిక్షపడింది. నిర్భయను దారుణంగా అత్యాచారం చేసిన ఎనిమిదేళ్లకు ఈ మానవ మృగాలకు ఉరి శిక్ష పడింది. డిసెంబరు 16, 2012న జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వీరిలో ఒకరు మైనర్‌ కావడంతో మూడేళ్ల శిక్ష అనంతరం అతణ్ని విడుదల చేశారు. మరో వ్యక్తి రామ్‌ సింగ్‌ మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అసలు ఈ నిర్భయను చెరిచిన ఆ ఆరుగురూ ఎవరు..అసలు వాళ్లు అంతకు ముందు ఏం చేసేవాళ్లు.. తెలుసుకుందాం..

 

 

నిర్భయను చెరిచిన వారంతా దిల్లీలోని ఆర్‌.కె.పురం మురికివాడ ప్రాంత నివాసితులు. వీరిలో చాలా మంది చదువు మధ్యలో మానేసిన వారే. అక్షయ్‌ ఠాకూర్‌ బిహార్‌కు చెందినవాడు. వీడు ఓ బస్సులో హెల్పర్ .. మధ్యలోనే చదువుమానేసిన ఇతడు 2011లో దిల్లీకి వచ్చాడు. అతనికి భార్య.. ఒక కొడుకు ఉన్నారు. వారు బిహార్‌లోని స్వగ్రామంలోనే నివాసముంటున్నారు.

 

పవన్ గుప్తా అనే వాడు ఓ పండ్ల వ్యాపారి. నేరం జరిగిన సమయంలో ఇతనికి 19 ఏళ్లు. వీడు తిహాడ్‌ జైలు నుంచే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. మరో దోషి రామ్‌ సింగ్‌ బస్సు డ్రైవర్ గా పని చేసేవాడు.. వీడు తిహాడ్‌ జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య నుంచి విడాకులు తీసుకున్న ఇతడు రాజస్థాన్‌ నుంచి 23 ఏళ్ల వయసులో దిల్లీకి వచ్చాడు. రామ్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. అతణ్ని చంపి ఉంటారని తండ్రి ఆరోపణ.

 

మరో దోషి ముకేశ్ సింగ్ అనే వాడు రామ్‌ సింగ్ సోదరుడు. ఇతడు అప్పుడప్పుడు బస్సు డ్రైవింగ్‌లో సోదరుడికి సాయం చేసేవాడు. రేప్ జరిగిన టైమ్ లో వీడు బస్సు క్లీనర్‌గా ఉన్నాడు. మరో దోషి వినయ్‌ శర్మ ఓ జిమ్‌ సెంటర్‌లో ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌. ఇక చివరి వాడు రేప్ జరిగే సమయానికి ఓ మైనర్.. అందువల్లే వీడు తప్పించుకున్నాడు. మూడేళ్ల పాటు జువైనైల్‌ హోంలో ఉండి డిసెంబరు 2015లో విడుదలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: