లోకంలో ఒక నీతి ఉంది.. అదేమంటే మంచి చేసే వారికి ఎప్పుడు మంచే జరుగుతుందని.. కానీ ఇప్పుడు మంచి చేసే వారిని జల్లడ పట్టినా కనిపించడం కష్టం.. అందుకే సృష్టి వినాశనానికి పునాది వేస్తుంది.. ఎప్పుడైతే మనిషిలో రోగాల సంఖ్య పెరిగిపోతుందో అప్పుడు అతను క్రమక్రమగా మరణానికి దగ్గర అవుతాడన్నది నిజం.. అలాగే ఎప్పుడైతే లోకంలో చెడు పెరిగిపోతుందో దాన్ని నిర్మూలించడానికి ఇలా కరోనా అనే వింత రోగాలు వచ్చి లోకంలో ఉన్న జనాభాను సగానికి సగం తగ్గించి వేస్తుంది.. అంటే స్వచ్చమైన జీవితాన్ని పొందమని ఈ సృష్టిని చేసిన దైవం చెబితే, దానికి విరుద్దంగా రాక్షసంగా జీవించడానికి అలవాటు పడుతున్న మానవాళికి గుణపాఠమే, భయంకరమైన వ్యాధుల రూపాలు..

 

 

మనిషిశరీరమే ఎన్నో ఘటనలకు ఉదాహరణ.. అదెలా అంటే నీకు జీర్ణం కాని పదార్ధం తిన్నప్పుడు దాన్ని బయటకు పంపడానికి జీర్ణవ్యవస్ద ఎంతగానో ప్రయత్నిస్తుంది.. ఈ క్రమంలో కడుపునొప్పి, విరేచనాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.. అలాగే లోకంలో మనుషులు చేసే నీచపు పనుల విషయంలో భరించ లేని పుడమి గానీ, ప్రకృతి గానీ ఇలాగే ప్రయత్నిస్తుంది.. ఇలా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. ప్రస్తుత పరిస్దితుల్లో కామం ఒక్కటే మనిషిని కోతిలా ఆడిస్తుంది. ఈ నేపధ్యంలో వావివరసలు గానీ, పాపపుణ్యాలు గానీ ఆలోచించడం మానేసాడు.. ఒక్కటే తన శరీర వాంచ తీర్చుకోవడం అనే గమ్యం దిశగా సాగుతున్నాడు..

 

 

ఇదే కాకుండా కొందరు కన్న తల్లులు కూడా నీచంగా ప్రవర్తిస్తున్నారు.. అదెలా అంటే ఇప్పుడు మనం చెప్పబోయే ఘటనలోని మాదిరిగా.. ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె(15), కుమారుడు ఉన్నారు. కాగా మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్య భర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ తండ్రి తన బిడ్దలను పెంచుతాను అన్న ఒప్పుకోని ఆ బుద్ధి హీనురాలు తనదగ్గరే ఉంచేసుకుంది.. సరే అలా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిందా అంటే అదీ లేదు.. తన కూతురును వ్యభిచార గృహానికి అమ్మేసింది..

 

 

అక్కడ వారు కొంతకాలం వాడుకుని వేరొక ముఠాకు అమ్మగా ప్రస్తుతం ఆ బాలిక ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది.. అయితే తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. ఇక తల్లి ప్రవర్తన నచ్చిని ఆ కుమారుడు ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడట. ఇప్పుడు చెప్పండి ఇలాంటి తల్లులు ఈ లోకంలో బ్రతకడం అవసరమా.. అమ్మా అనే పిలుపుకే మాయని మచ్చతెచ్చిన ఈ ఆడదాన్ని పోలీసులు కటకటాల్లోకి పంపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: