ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో... ప్రముఖ సింగర్ కనికా కపూర్ వ్యవహారం ప్రస్తుతం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆమె ఒక్క దానికే కరోనా  వైరస్ సోకితే పర్వాలేదు కానీ ఆమె ద్వారా ఎంతో మందికి సోకే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే  లండన్ నుంచి వచ్చిన సింగర్ కనికా కపూర్ నేరుగా ఓ పార్టీలో పాల్గొనడం... ఈ పార్టీలో చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు హాజరు కావడం.. ఆ తర్వాత ఆమెకు కరోనా  ఉన్నట్లు నిర్ధారణ కావడంతో... ఆమె కారణంగా ఇంకా ఎంత మందికి ఈ వైరస్ సోకి ఉండవచ్చు అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

 

 

 అయితే కనికా కపూర్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఎంతమందిని కలిసింది అనే దానిపై ప్రస్తుతం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆమె కేవలం ఒక్క పార్టీ లో మాత్రమే పాల్గొన్నాnu అని చెప్పుకొచ్చింది... కానీ ఆమె తండ్రి రాజీవ్ కపూర్ మాత్రం తన కుమార్తె ఏకంగా మూడు పార్టీలలో పాల్గొని దాదాపు నాలుగు వందల మంది కలిసింది  అని చెప్పడం ప్రస్తుతం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడి గురి చేసుకుంది. అయితే కనికా కపూర్ కలిసిన వారిలో తమ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ప్రస్తుతం మేమందరం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. 

 

 

 ఇదిలా ఉంటే తండ్రి తన కూతురు నాలుగు వందల మంది ని కలిసింది అంటూ చేసిన వాక్యాలను కనికా కపూర్ ఖండించింది. తాను లండన్ నుంచి వచ్చాక  ఒకే ఒక గెట్ టుగెదర్ పార్టీ లో పాల్గొన్నాను అంటూ తెలిపింది. కేవలం 30 మంది మాత్రమే కలిసినట్టు తెలిపింది. తాము పార్టీకి హాజరైన సమయంలో అందరం  చేతులకు గ్లౌజులు ధరించి ఉన్నాము  అంటూ క్లారిటి ఇచ్చింది. అయితే ఇప్పటికే కనికా కపూర్ తో కలిసి పార్టీలో పాల్గొన్న వారిలో రాజస్థాన్ మాజీ సీఎం ఆమె కుమారుడు కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తో పాటు ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ కూడా సెల్ఫ్ క్వారంటైన్  లోకి వెళ్ళిపోయారు. కనికా కపూర్ తోపాటు పార్టీలో హాజరైన వారు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: