ప్రేమ.. ఎప్పుడు.. ఎవరి మధ్య చిగురిస్తుందో తెలియదు. ప్రేమకు కులాలు, మతాలు, ధనికుడు, పేదవాడు అని తేడా ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడైనా పుట్టొచ్చు. అయితే ఆ ప్రేమే ప్రాణాలు తీస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఓ యువతి.. తనకు ఇష్టంలేని వారిలో పెళ్లి చేశారని.. మూడు నెలలకే భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ మరొకరితో ప్రేమలో పడింది. కానీ, ఇద్దరి కూడాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రేమికులిద్దరూ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషాదఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరపత్తూరు జిల్లా పూంగ్కులమ్ పుద్దూర్ వట్టమ్ గ్రామానికి చెందిన నందిని(20)కి రెండేళ్ల కిందట దూరపు బంధువులకు ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే నందినికి పెళ్లి ఇష్టంలేకపోయినా.. తలవంచి తాళి కట్టించుకుంది. కానీ, వారి బంధం మూడునాళ్ల ముచ్చటే అయింది. నందిని కేవలం మూడు నెలలకే భర్తను వదిలేసి.. కోయంబత్తూర్ ప్రాంతంలోని ఓ టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగం స్టాట్ చేస్తింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచడం కాస్త ప్రేమగా మరింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే రామదాస్ దళిత వర్గానికి చెందినవాడు కాగా నందిని వన్నియార్ కులానికి చెందిన యువతి.
ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో పాటు.. ఆమెకి గతంలోనే పెళ్లైన కారణంగా వారిద్దరి వివాహానికి ప్రియుడి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అయితే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఆ ప్రేమికులు ఇంట్లో నుంచి పారిపోయారు. ఆ తర్వాత రెండురోజుల పాటు వేరే ప్రాంతంలో గడిపారు. అనంతరం రామదాస్ ఇంటికి ఫోన్ చేసి తాను నందినిని అంబూర్ దేవాలయంలో పెళ్లి చేసుకున్నానని.. తాను ఇక ఇంటికి రానని తెగేసి చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే మరుసటి రోజే అనూహ్యంగా ప్రేమజంట రైలు పట్టాలపై నిర్జీవంగా పడి ఉండడంతో అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు.. చనిపోయే ముందు ప్రేమికులిద్దరూ సెల్ఫీ తీసుకుని మరీ చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.