ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 (కరోనా) వైరస్ కు ప్రజలు వణికిపోతున్నారు. దేశంలో కలవరపెడుతున్న ఈ వైరస్ ఓ బాలీవుడ్ సెలబ్రిటీకి పాజిటివ్ రావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటివల లండన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ రావడం.. వచ్చాక ఆమె వివరాలు దాచి పార్టీకి అటెండ్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు ఆమె తండ్రి రాజీవ్ కపూర్ చేసిన వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి.

 

 

కనిక లండన్ నుంచి వచ్చిన తర్వాత ఓ పార్టీ నిర్వహించడంతో పాటు రెండు పార్టీలకు అటెండ్ అయిందని ఆయన చెప్పడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా.. ఈ పార్టీల్లో దాదాపు 400 మంది కనిక పార్టీకి అటెండ్ అయ్యారని కూడా చెప్తున్నారు. తాను ఒక పార్టీకే వెళ్లానని కనిక చెప్తున్న మాటలకు ఆమె తండ్రి చెప్తున్న మాటలకు పొంతన లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కనిక ఇచ్చిన పార్టీకే ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరవడం తెలిసిందే. ఆ పార్టీ మరునాడు ఆయన పార్లమెంట్లో పలువురు ఎంపీలతో కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారెవరో విచారణ చేస్తున్నారు. దుష్యంత్ సింగ్ తో పాటు ఆమె తల్లి వసుంధర రాజె స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

 

 

మరి కనిక విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఏం ముట్టుకోవాలన్నా.. పలకరింపులకైనా.. బయట తిరగాలన్నా బెంబేలెత్తిపోతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో భారత్ లో కూడా ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. రేపు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ కు సిద్ధమవుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: