రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలను వాయిదా వేసింది. తొలుత దీనిని ఆరు వారాలు వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. వాయిదా పడకుండా చూడాలని అనుకుంది. కానీ, కుదరలేదు. దీం తో ఎన్నికలు విధిలేని పరిస్థితిలో వాయిదా పడ్డాయి. అయితే, ఈ వాయిదాపై తొలుత ప్రధాన పక్షం టీడీపీలో ఆనందం వెల్లివిరిసి నా.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రోజులు గడిచే కొద్దీ తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు, అధికార పార్టీ నాయకుల్లోనూ ఇదే తరహా బాధ కనిపిస్తోంది. మిగిలిన పార్టీల్లోనూ ఇదే తరహా పరిస్థితి తెరమీదికి వచ్చింది. దీనికి కారణం.. అభ్యర్థుల్లో తీవ్ర మైన గందరగోళం. ఏదో వారం రోజుల్లో ఎన్నికల ప్రహసనం పూర్తవుతుందని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వారాలకు వారాలు, నెలలకు నెలలు వాయిదా పడడంతో వారు తల్లడిల్లుతున్నారు.
అంతేకాదు, అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ పట్టుకొంది. ఎన్నికల వరకు అనుచరులను ఎలా కాపాడుకోవాలనే దిగులు వెంటాడు తోంది. ఇప్పటికే అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపెడైంది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడడంతో సమీకరణాలు మారుతాయో మోనని ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల్లో ఎన్నికలు ముగిస్తే ప్రచార ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అభ్యర్థులం తా అంచనా వేశారు. ఇంతలో ఎన్నికల సంఘం నిర్ణయం మార్చడంతో విలవిల్లాడుతున్నారు. వాస్తవానికి ప్రాదేశిక ఎన్నికల ప్రచార సమయం తక్కువగా ఉండటంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే ప్రచారం మొదలుపెట్టారు. కొంతమంది ముందే ప్రచారంలోకి దిగి ఒక విడత గ్రామాలను చుట్టేశారు. ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడందరూ ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు.వాయిదా పడడంతో మళ్లీ తిరిగి ఎన్నికల వరకు ఓటర్లు, అనుచర గణం చేజారకుండా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని కలవర పడుతున్నారు. ప్రత్యర్థులు బలం పుంజుకోకుండా ఎన్ని తిప్పలు పడాలోనని భయపడుతున్నారు. ఇంట్లో ఉన్నదంతా ఖర్చు చేస్తే తర్వాత పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు కావడం తో వాస్తవానికి ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ జరగాలి. ఎన్నికలు వాయిదా పడటంతో సర్పంచ్ పదవులు ఆశించే వారి సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వచ్చినందుకు అవకాశం కల్పించాలని చాలామంది నాయకులు కోరుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాలకు వేలం పాటలు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఆశావహుల సంఖ్యతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొంది. అయితే, ఎవరూ కూడా బాహాటంగా తమ వేదనను వెల్లడించకపోవడం గమనార్హం.
|
|