ఈ మధ్య కాలంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం... తనువు చాలించడం లాంటివి చేస్తున్నారు.  క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని... ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెరమీదకు వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని... లేద ఇంకా ఏదైనా కారణాల వలన... క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు. ఇక తాజాగా ఇక్కడ జరిగిన ఆత్మహత్య సంచలనం రేపింది. ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకోవటం  స్థానికంగా కలకలం రేపింది. కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది

 

 

 మధ్యప్రదేశ్ కు  చెందిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యే సురేష్ దక్కడ్  కుమార్తె జ్యోతికి వివాహం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేష్ దక్కడ్ కుమార్తె  జ్యోతి మెట్టినింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. రాజస్థాన్ లోని తన అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి సమయంలో ఆమె నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఎమ్మెల్యే సురేష్ దక్కడ్  కూతురు జ్యోతి. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఈ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సురేష్ కుమార్ కుమార్తె మెట్టినింటికి  రాజస్థాన్ చేరుకున్నారు. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి కూతురు విగతజీవి గా కనిపించడం చూసి తండ్రి సురేష్ దక్కడ్  తట్టుకోలేకపోయారు. 

 

 

 అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకోవడం పెద్ద దుమారమే రేపింది. అయితే ఎమ్మెల్యే కూతురు జ్యోతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. జ్యోతి భర్త డాక్టర్ జై సింగ్ రాజస్థాన్ వైద్య విభాగంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఆత్మ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కీలక వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా  ఎమ్మెల్యే సురేష్ దక్కడ్  మధ్యప్రదేశ్లోని నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య వెంట నడిచిన ఎమ్మెల్యేలలో సురేష్ దక్కడం కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి: