ఈ మధ్య కాలంలో చదువుకున్నవారు కష్టపడకుండా డబ్బులు సులభంగా రావాలనే ఉద్దేశ్యంతో ఏ పని చెయ్యడానికైనా వెనకాడటం లేదు. చదువుకున్న పిల్లలే ఇలాంటి పనులు చెయ్యడానికి ఎక్కువగా పూనుకుంటున్నారు. చదువు పేరుతో పట్టణాలకు రావడం తల్లిదండ్రులను మోసం చేసి చదువుకునే దగ్గర తోటి స్నేహితులను మోసం చేసి చివరకి నేరస్తులుగా మారుతున్నారు. మనం చేసే పని మంచిదా చెడ్డదా అని కూడా ఆలోచించడం లేదు. కేవలం డబ్బులు..సెక్స్ మాత్రమే నేటి యువతకు టార్గెట్గా అవుతున్నాయి. ఇక ఇలా తయారవడానిక ప్రధాన కారణం వారు పెరిగే వాతావరణమా లేక తల్లిదండ్రుల పెంపక లోపమా అన్నది అర్ధం కావడం లేదు.
ఇక ఇటీవలె విశాఖలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బీటెక్ చదివే ఓ కుర్రాడు. తనతో పాటే చదువుకునే అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. నెమ్మదిగా ఆ అమ్మాయిని ట్రాప్ చేసి తన వలలో వేసుకున్నాడు. ప్రేమ, పెళ్ళి అంటూ వల్లమానిన ప్రేమను చూపించాడు. అలా ఇద్దరూ కొంత కాలం బాగానే తిరిగారు. ఆతర్వాతే ఆ అబ్బాయి నిధానంగా తన నిజస్వరూపాన్ని బయట పెట్టాడు. ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. దాంతో ఆ అమ్మాయి అతడిని దూరంగా పెట్టడం మొదలు పెట్టింది. ఎక్కువగా మాట్లాడేది కాదు. పెద్దగా కలిసేదికాదు. పూర్తిగా ఎవైడ్ చెయ్యడం మొదలుపెట్టింది. దీంతో అది గమనించిన యువకుడు ఆ అమ్మాయిని బెదిరించి నాతో ఉన్న ప్రేమ గురించి పబ్లిక్గా చెప్పి రచ్చ చేస్తానన్నాడు. దాంతో ఆ యువతి భయపడి అతనికి లొంగిపోయింది.
ఇద్దరూ శారీరకంగా ఒకటయ్యారు ఆ తర్వాత అదే అదునుగా తీసుకుని మాట్లాడితే ఆమెను డబ్బులకు వేధిస్తూ శారీరకంగా కూడా వాడుకునేవాడు అలా ఆ యువకుడు ఆ అమ్మాయి దగ్గర దాదాపు 10లక్షలు దాకా తీసుకున్నాడు. ఇక ఆమె అతగాడి టార్చర్ను భరించలేక పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు విశాఖలో జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన పోలీసులు కేసును శ్రీకాకుళం బదిలీ చేశారు. నిందితుడిని శ్రీకాకుళం తరలించి విచారిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్న సందదర్భంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి.