ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారానికి సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాచారాల విషయంలో ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా నేరాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నర్సుకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసి వీడియో తీసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఆ తర్వాత ఆ వీడియోను చూపించి మానవ మృగం నర్సుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో ఒక యువతి నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు కూలి పని చేసే మోను అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఒక పెళ్లి వేడుకలో ఏర్పడిన పరిచయం స్నేహానికి దారి తీసింది. 
 
ఒకరి ఫోన్ నంబర్లు మరొకరు మార్చుకొని తరచుగా ఫోన్లు మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు మోను ఆస్పత్రి దగ్గర యువతిని డ్రాప్ చేసేవాడు. ఆమెతో నమ్మకంగా ఉంటూనే ఒకరోజు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్నంతా మొబైల్ కెమెరా సహాయంతో రికార్డ్ చేశాడు. అనంతరం తరచుగా యువకుడు బెదిరింపులకు పాల్పడేవాడు. 
 
అత్యాచారానికి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్ లో పెడతానని పలుమార్లు యువతిని బెదిరించి మోను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత తనను వివాహం చేసుకోవాలని యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. వీడియోను అడ్డం పెట్టుకొని తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.                             

మరింత సమాచారం తెలుసుకోండి: