ఓ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అయితే ఏమైందో తెలియదు కానీ పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులు బాగానే సంసారం చేశారు.. అలా ఉన్న వారి లైఫులో ఏమైందో తెలియదు గానీ అనుకోకుండా భార్య చనిపోయిందని వార్త మనుషులను కదిలించి వేసింది.. అయితే భార్య శవాన్ని మంచం మీద పెట్టుకొని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ప్రస్తుతం అందరినీ కదిలించి వేస్తుంది.. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు విగజీవులుగా మారారు.. వారిద్దరి మద్య బందమా లేదా ఇంకేదైనా ఉందా అనే విషయాలు మనుషులను కదిలించి వేస్తుంది.. 

 

 

వివరాల్లోకి వెళితే...ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకి గుర్తుగా మరికొద్దిరోజుల్లో బిడ్డ పుట్టబోతోంది. ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేవ్. మధురానుభూతులు పంచుకుంటూ సాగిన వారి కాపురంలో ఊహించని విధంగా కలతలు రేగాయి. కలహాలతో ఇద్దరి మనసులూ గాయపడ్డాయి. తరచూ గొడవలు జరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయారు. సడెన్‌గా ఓ రోజు ఉదయం ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రావడం లేదు. లోపలికి వెళ్లడం లేదు. ఎలాంటి అలికిడీ లేకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు.. 

 

 

 

వారికి దిమ్మతిరిగేలా ఇద్దరు చచ్చి పడివున్నారు.. మూడు నెలలు ఉన్న భార్య రక్తపు మడుగులో మంచం పై పడి ఉంది.. భర్త ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారాన్ని అందించారు.. అణువుణువూ గాలించడంతో ఇంట్లో ఓ చోట భర్త రాసిన సూసైడ్ నోట్ దొరికింది. ఇద్దరూ ఎలా చనిపోయారో తెలియక తలలు పట్టుకున్న పోలీసులకు ఆ నోట్‌లో సమాధానం దొరికింది. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

 

 

 

సూసైడ్ లెటర్‌ రాసి పెట్టడంతో అసలేం జరిగిందన్న సస్పెన్స్‌కి తెరపడింది. తాను ఉదయం బయటకు వెళ్లి రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చేప్పటికి తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని రాసి ఉంది. తన వల్లే తన భార్య, కడుపులో బిడ్డ చనిపోయారని.. అందుకే తాను కూడా ఉరి వేసుకుని చనిపోతున్నట్లు రాసుకున్నాడు. తన భార్య శవాన్ని ఉరి తాడు నుంచి తప్పించి మంచంపై పడుకోబెట్టానని.. తాను ఉరి వేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో రాసి పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దికాలానికే కలతలు రేగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని.. అది తట్టుకోలేకే భర్త కూడా ఉరి వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: