విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధ్యక్షుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేసే విజయసాయి రెడ్డి ఈరోజు కూడా మరో సంచలన వ్యాక్యలు చేశారు. స్థానిక ఎన్నికల వాయిదాపై అయన రోజుకు ఒకలా ఫైర్ అవుతున్నారు.  

 

అసలు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఇలా స్పందించారు.. ''స్థానిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు ఆశచూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు.'' అంటూ ట్విట్ చేశారు. 

 

నిమ్మగడ్డతో డ్రామాలు ఆడించాడు అని.. అసలు చంద్రబాబు ఎన్నో ఎత్తుగడలు వేసిన ఫలించలేదు అని చెప్పకనే చెప్పాడు.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓటర్లకు ఆశ చూపినప్పటికీ డబ్బు తీసుకోవడానికి తిరస్కరించారు అని.. అందుకే ఆ విషయానికి బయపడి.. జిల్లాలవారీగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతారు అని బయపడి నిమ్మగడ్డతో ఈ వాయిదా నాటకం ఆడారు అని అయన చెప్తున్నారు. 

 

కాగా ఈ ట్విట్ చుసిన నెటిజన్లు వారి పద్దతిలో స్పందిస్తున్నారు.. నిమ్మగడ్డ నాటకాలు.. చంద్రబాబు నాటకాలు అని.. వీళ్లకు రోజులు దగ్గర పడ్డాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ట్విట్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి ఈ ట్విట్ పై నిమ్మగడ్డ రమేష్.. చంద్రబాబు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: