ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు  చాస్తూ ఎంతో మందిని ప్రాణభయంతో బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో... బాలీవుడ్ ప్రముఖ గాయకురాలు కనికా కపూర్  వ్యవహార శైలి ప్రస్తుతం భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన ఆమె... ముంబైలో ఓ పార్టీలో పాల్గొనడం... ఇదే పార్టీలో ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొనడం... ఇక ఈ పార్టీలో పాల్గొన్న తర్వాత సింగర్ కనికా కపూర్ కి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో... అధికారులందరూ అప్రమత్తమయ్యారు. అయితే కనికా కపూర్ ఇండియా వచ్చిన తర్వాత ఎంత మంది ని కలిసింది అనేదానిపై ప్రస్తుతం రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

 

 

 ఇకపోతే తాజాగా కనికా కపూర్ తీరుపై హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ లో పర్యటించి వచ్చిన తర్వాత సింగర్ కనికా కపూర్ కు కరోనా  వైరస్ సోకడం వల్ల ఆమెను లక్నో నగరం లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐసొలేషన్  వార్డులో గది  కి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసొలేషన్  వార్డులో కరోనా  వైరస్ ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నా కనికా కపూర్ ఒక సెలబ్రిటీ లా కాకుండా... పేషెంట్ లా  ప్రవర్తించాలి అంటూ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ సూచించారు. 

 

 

 ఇప్పటికే బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ని ఒక ప్రత్యేక గదిలో ఉంచి ఆమెకు అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు టీవీ సౌకర్యాలు కూడా కల్పించాము అంటూ ఆస్పత్రి డైరెక్టర్ చెప్పుకొచ్చారు. సింగర్ కనికా కపూర్ చికిత్స విషయంలో తాము ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నాము  అంటూ తెలిపిన ఆయన... కనికా కపూర్ సెలబ్రిటీల కాకుండా ఒక రోగిలా ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ సలహా ఇచ్చారు. అయితే భారత్లో కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి సెలబ్రిటీగా కనికా కపూర్ నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనికా కపూర్ పార్టీకి హాజరైన చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు సెల్ఫ్ ఐసోలేషన్ లో  ఉన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: