ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల అందరూ చూపు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ ఆర్ సినిమా పైనే.. ఎందుకంటే బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మొదటి సినిమా కావడం... ఇక ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటిస్తుండడం ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలను పెంచేస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న లీక్ వచ్చిన అది సెన్సేషనల్ గా మారిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్రకటించింది.
అయితే అనుకున్న తేదీకి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ఎంతో హడావిడి చేస్తోంది. ఇలాంటి క్రమంలోనే కరోనా వైరస్ ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ వేసింది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నియంత్రణకు సినిమాల షూటింగులు కూడా ఆపివేయాలి అని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చిన మేరకు... ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించి తమ చిత్రీకరణను నిలిపివేసింది. ప్రస్తుతం షూటింగ్ టెన్షన్ కాస్త లేకపోవడంతో దర్శకధీరుడు రాజమౌళి తో పాటు ఇద్దరు స్టార్ హీరోలు సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు పలు సూచనలు పాటించాలి అంటూ రాజమౌళి టీం ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే కరోనా వైరస్ వల్ల వచ్చిన ఈ గ్యాప్ లో దర్శక ధీరుడు రాజమౌళి తనకు ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ పై దృష్టి సారించారు. రాష్ట్ర కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్.. చాంపియన్ గా నిలిచిన నల్గొండ జట్టుకు ట్రోఫీ అందించారు. ఇక ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫోటోపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని చెబుతూనే జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మాస్కులు లేకుండా ఫోటో దిగుతారా అంటూ కొంతమంది కామెంట్ చేశారు. అయితే కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చేంతవరకూ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం మాత్రం లేదు... ఈ నేపథ్యంలో మరోసారి షూటింగ్ వాయిదాపడిన పడుతుంది. దీంతో మరోసారి అటు నందమూరి మెగా అభిమానుల్లో కూడా సినిమా సరైన డేట్ కు విడుదల అవుతుందా అనే ప్రశ్న తలెత్తింది.