ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. మానవతా విలువలు మాయమైపోతున్నాయి. తాజాగా ఒక మహిళ కూతుతు భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన కూతురు స్థానికులను అప్రమత్తం చేసి అత్తాఅల్లుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే నాందేడ్ లో సావిత్రి కూతురు అనితతో కలిసి జీవించేది. కూతురు పెళ్లీడుకు రావడంతో కొంతకాలం క్రితం ఆమెకు నవీన్ కుమార్ తో వివాహం చేసింది. కూతురు, అల్లుడు కూడా నాందేడ్ లోనే మరో ఏరియాలో నివాసం ఉండేవారు. ఒకే ఊరు కావడంతో అత్తాఅల్లుడి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత సావిత్రి తరచుగా కూతురు ఇంటికి వచ్చేది. ఒకరోజు అనిత నిద్రపోయిన సమయంలో భర్త తన గదిలో లేడని గుర్తించింది. 
 
భర్త కోసం వెతకగా తల్లి పడుకున్న గదిలో తల్లి, భర్త అసభ్యకర రీతిలో ఉండటంతో షాక్ కు గురైంది. ఇద్దరినీ అనిత నిలదీయగా వారిద్దరూ ఆమెను క్షమించమని కోరారు. విషయం బయటకు తెలిస్తే తన కాపురం నాశనం అవుతుందని భావించి అనిత ఇద్దరినీ బుద్ధిగా ఉండాలని హెచ్చరించింది. ఆ తర్వాత కొంతకాలం భర్త బాగానే ఉన్నా రోజూ ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండటంతో అనితకు అనుమానం వచ్చింది. 
 
భర్తపై నిఘా పెట్టిన అనిత స్థానికుల సహాయంతో అల్లుడు అత్తతో రాసలీలలు కొనసాగిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. స్థానికులు అత్త, అల్లుడికి దేహశుద్ధి చేశారు. తల్లి, భర్త మోసం చేయడంతో అవమానంగా భావించిన అనిత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అత్త, అల్లుడిని అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: