ఈ మధ్య కాలంలో సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఈ రోజుల్లో  హత్యలు ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. హాయిగా గడిచిపోతున్న  దాంపత్య జీవితం లోకి మూడో వ్యక్తి  రావడంతో... ఆ మూడో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే  కడతేర్చేందుకు   సిద్ధపడుతున్నారు. ఇలాంటి దారుణమైన హత్యలు ఆత్మహత్యలు చాలానే తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేస్తూ అక్రమ సంబంధానికి తెరలేపుతున్నారు. చివరికి అక్రమ సంబంధాల్లో  సమస్యలు తలెత్తి ప్రాణాలు తీసుకునేంతవరకు వెళుతున్నాయి. 

 

 

 ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది... 2 సంవత్సరాల క్రితం భర్త చనిపోయి కొడుకుతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఓ మహిళను టార్గెట్ చేశాడు రవి అనే వ్యక్తి. ఆమెతో పరిచయం పెంచుకుని లైంగిక సంబంధానికి తెరలేపాడు. ఇక ఆమెపై లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఉండేవాడు. ఇక ఈ విషయం కాస్తా మహిళ కొడుకు మరిది  వరకు వెళ్లడంతో... పద్ధతి మార్చుకోవాలని  రవిని మందలించారు. అయినప్పటికీ తీరు మార్చుకోని రవి... సదరు మహిళ లైంగిక సంబందం  కొనసాగించాడు. దీంతో కాపుకాసి రవిని రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్న మహిళా  కొడుకు మరిది  అతనిపై దాడి చేసి దారుణంగా చంపేశారు. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా బాలె  గ్రామానికి చెందిన తాడూరి రవి భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో పరిచయం పెంచుకుని  అక్రమ సంబంధానికి తెరలేపాడు.

 

 

 దీనిపై కొడుకు మరిది ఎన్నిసార్లు హెచ్చరించిన తీరు మాత్రం మర్చుకోలేదు. దీంతో రోజు లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ప్రియురాలి ఇంటికి వెళ్లగా... రవి పై ఆ మహిళ కొడుకు మరిది దారుణంగా దాడి చేశారు. బండలు కొట్టే గన్ తో  అతని పై దాడి చేసి అతని కింద పడి పోగానే తలపై బండరాయితో మోదారు.  దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ క్రమంలోనే మహిళ పై కూడా దాడి చేయగా ఆమె తప్పించుకుంది. రవిని హత్య చేసిన నిందితులు రేక్యా తండా వైపు నడుచుకుంటూ వెల్లగా.. అదే సమయంలో  పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఎదురుపడగానే అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. దీంతో ఇద్దరు నేరం ఒప్పుకున్నారు నిందితులు. ఇక రవి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: