ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి.. ఒక్కో లా ఒక్కో విధంగా అమ్మాయిలను పూర్తిగా వాడుకోని వారిని వ్యభిచార కూపంలోకి లాగేస్తున్నారు.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలానే చేస్తున్నారు.. అందుకే అమ్మాయిల ఆత్మ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇకపోతే ఉద్యోగం ఇస్తానని నమ్మించి మోసం చేసి అమ్మాయిలను వ్యభిచార గృహంలోకి లాగేస్తున్నాయి కొన్ని ముఠాలు.. 

 

 


వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. క్లినిక్ ముసుగులో వ్యభిచార దందా నడుపుతున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెట్‌గా పట్టుకున్నారు. వీరిలో మధ్యప్రదేశ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. భోపాల్ నగరంలోని బర్కాహేది ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

 

 

ముందుగా నగరంలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వద్ద కొద్దిరోజులు పనిచేయాల్సి ఉంటుందని, అక్కడ పనితనం నిరూపించుకుంటే మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. అయిదే దీనికి ముందుగా పెద్దమొత్తంలో ఫీజు చెల్లించాలని చెప్పారు. తాను పేద కుటుంబానికి చెందిన అమ్మాయినని, అంత డబ్బు ఇవ్వలేనని మాయ చెప్పింది. అయితే తమకు తెలిసిన ఓ డేటింగ్ సంస్థ ఉందని, దానిద్వారా ఓ అబ్బాయితో కొద్దిరోజులు డేటింగ్ చేస్తే పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చని, దానితో ఫీజు కట్టేయొచ్చని వారు చెప్పారు.

 

 

 

అయితే కొద్దీ రోజులు బాగానే ఉన్న ముఠాపై అనుమానం రావడంతో మాయ అక్కడి నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్లాన్ ప్రకారం ఆ ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఉద్యోగాల వేటలో ఉన్న అమ్మాయిలను తాము ట్రాప్ చేసి వ్యభిచారం లోకి దించుతున్నామని నిందితులు చెప్పడంతో వారు షాకయ్యారు. వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు ఉద్యోగాల పేరుతో మోసపోయి వ్యభిచార గృహంలో అల్లాడుతున్నారు అని పోలీసులు వెల్లడించారు...

మరింత సమాచారం తెలుసుకోండి: