శనివారం నాడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చరిత్రని సృష్టించారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ ఏరియాలో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఒక్క రోజులో భారీగా చలాన్లు వేసి రికార్డు కొత్త రికార్డును సృష్టించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపట్ల పోలీసుల ఉక్కుపాదం మోపారు. దీనితో రూల్స్ అతిక్రమించే వారిపై ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీసి వారికీ ఫైన్ ని విధించారు.

 

 


శనివారం నాడు ట్రాఫిక్‌ పోలీసులకు ఎటువంటి స్పెషల్‌ డ్రైవ్‌లంటూ ఏమీ లేకపోవడంతో, వారందరు రోడ్లపైనే ఉండి ట్రాఫిక్ నియంత్రణని చేపట్టారు. అదే చేతితో  కెమెరాలు చేతిలో ఉంచుకొని ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఒక కన్ను వేశారు. దీని ఫలితంగా శనివారం ఒక్కరోజే ఏకంగా 22,080 ట్రాఫిక్‌ ఈ-చలానాలు వేయడం జరిగింది. మాములు రోజుల్లో ఇవి 10 - 13 వేల వరకూ మాత్రమే ఉండేది. కానీ, ఒక్క శనివారం మాత్రం దాదాపు రెట్టింపు సంఖ్యలో చలాన్లు జారీ చేసి రికార్డు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇందులో ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న మాదాపూర్ ప్రాంతం సహా బాలనగర్, శంషాబాద్‌ జోన్లలోని 10 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ల పరిధుల్లో ఈ సంఖ్య ఎక్కువుగా నమోదైంది.

 

 

 
ఇలా చలానాలు పడ్డ వారిలో చాలామంది  రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్, త్రిపుల్‌ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, వంటి సంఘటనలే  ఎక్కువగా అందులో ఉన్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే ఎక్కడా వాహనాలను రోడ్లపై ఆపి తనిఖీ చేయకపోవడం. దీనితో అసలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడ్డ కేసులు నమోదు కాలేదు. ఇందులో చాలా వరకు సైబరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ప్రూఫ్ తో  సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంఏకంగా ఒక్కరోజులో 2,497 ఈ చలాన్లను జారీ చేసినట్లుగా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇలా నిబంధనలు పాటించని వారిలో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులే ఉన్నారని అధికారులు ఇచ్చిన సమాచారం తెలుపుతుంది. ఏది ఏమైనా ట్రాఫిక్ చలానాలు వేయడంలో హైదరాబాద్ పోలీసులు వారికీ వారే సాటి

మరింత సమాచారం తెలుసుకోండి: