ప్ర‌స్తుతం స‌మాజంలో  ఆడ,మగ అనే తేడా లేకుండా వైవాహిక సంబంధాలు పెట్టుకుంటూ అడ్డంగా దొరుకుతున్నారు. వీటి వల్ల హత్యలు, ఆత్మహత్యలు కూడ వీపరీతంగా పెరుగుతున్నాయి. పెళ్లైన తర్వాత జీవితాంతం కలిసుండాల్సిన భార్యాభర్తలు.. ఇత‌ర సుఖాల కోసం అక్రమ సంబంధాలవైపు మెగ్గు చూపుతున్నారు. భార్యాభర్తల మధ్య ప్రధానంగా సత్సంబంధాలు లేకపోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం మూలంగా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల వారి మధ్యలోకి మూడో వ్యక్తి చేరడం మూలంగా మూడుముళ్ల బంధం ముక్కలవుతుంది. దీన్ని వ‌ల్ల కుటుంబం చిన్నాభిన్నం అవ్వ‌డ‌మేకాకుండా.. ప్రాణాల‌ను కూడా విడ‌వాల్సి వ‌స్తుంది.

ఇక తాజాగా ఓ యువ‌తికి పెళ్లై, పిల్ల‌లు ఉన్నా ప్రియుడితో రాస‌లీలు కొన‌సాగిస్తుంది. ఈ విషయం కాస్త భర్తకు తెలిసి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్తనే అడ్డుతొల‌గించింది. పూర్తివివ‌రాల్లోకి వెళ్తే.. వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ కాశికుంటలో రాదారపు రాజు (33) తన భార్యతో నివాసిస్తున్నాడు. అయితే అనేక కార‌ణాల వ‌ల్ల భార్యా, భర్తలకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రాజు భార్య శివరాత్రి అనిల్‌ అనే వ్యక్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఈ విష‌యం తెలిసిన రాజు భ‌ర్య‌ను తీవ్రంగా దూషించాడు.

దీంతో త‌న అక్ర‌మ‌సంబంధాన్ని అడ్డు వ‌స్తున్న రాజును ఎలాగైనా చంపాల‌ని డిసైడ్ అయింది. ఈ క్ర‌మంలోనే శుక్రవారం రాత్రి అనిల్‌తో కలిసి భర్తను తాడుతో మెడకు ఉరివేసి చంపింది. ఆ త‌ర్వాత ఎవ్వరికీ తెలియకుండా తెల్లవారుజామున ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. రాజు శవం ఇంట్లోనే ఉండ‌డంతో కుళ్లిన వాసన వచ్చింది. అది గమనించిన చుట్టుపక్కల వారు వెళ్లి చూస్తే రాజు శ‌వం ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో వెంట‌నే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే మిల్స్‌కాలనీ సీఐ నరేష్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి చెల్లి రేణుక ఇచ్చిన ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: