ఏమి బ్రతుకులురా మనుషులవి.. ఇక లోకంలో ఇలాంటి పాపాలు పెరుగుతుంటే ప్రపంచం నాశనం కమ్మంటే ఎందుకు కాదు.. ఒక వైపు ప్రజలంతా రోగాలతో అల్లాడిపోతుంటే, మరో వైపు కామం అనే పిశాచిని ఒంటిలో ఆవహించుకుని కొందరు మదమెక్కి కొట్టుకుంటున్నారు.. రేప్ చేసిన వారిని దయ లేకుండా చంపుతున్న, ఒక్కడికి కూడా భయం అనేది లేకుండా పోతుంది.. ఇదే కాకుండా ప్రపంచ మొత్తం బ్రతికి బట్టకడితే చాలురా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపేస్తుంటే కొందరు దరిద్రులు మాత్రం మానభంగాలు చేయడం మానడం లేదు..

 

 

ఇకపోతే స్కూల్‌ బాత్రూమ్‌లోనే, 8ఏళ్ల బాలికపై నలుగురు స్కూల్ విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో చోటుచేసుకుంది. ఆ వివరాలు చూస్తే.. జనవరి 21న బాలిక స్కూల్ మెయిన్ గేట్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు బాలురు ఆమెను మాటల్లోకి దించి, అనంతరం బాత్రూమ్‌కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారట.. అంతే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.

 

 

దీన్ని ఆసరాగా చేస్తున్న ఆ నలుగురు దుర్మార్గులు ఆమెపై మూడుసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా మళ్లీ ఈ నెల 9న వారు మరోసారి అత్యాచారానికి పాల్పడటంతో ఓపిక నశించిన ఆ బాలిక జరిగిన విషయం తన  తల్లికి చెప్పిగా, ఆమె స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఆస్కూల్ యజమాన్యం మాత్రం తమ స్కూల్లో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరగలేదని సర్ధి చెప్పుకుని ఆ నలుగురు విద్యార్థులపై చర్యలు తీసుకోకుండా, బాలికకు మాత్రం టీసీ ఇచ్చి పంపించిందట...

 

 

తప్పుచేసిన వారిని వెనుకేసుకు రావడంతో తన కూతురికి జరిగిన అన్యాయానికి కడుపు రగిలిన ఆ తల్లి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, కూపిలాగిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి నలుగురు నిందితులపై ఐపీసీ 376డీబీ సెక్షన్‌తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నలుగురు నిందితులను మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదని, ఆ నిందితులు మైనర్లు కావడంతో గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే మైనర్లుగానే ఇంతపెద్ద తప్పు చేస్తే ఇక ముందు ముందు ఇలాంటి వారు నేరస్తులుగా మారి ఇంకెన్ని దారుణాలకు పాల్పడతారో అని అంటున్నారు కొందరు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: