కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఈ కరోనా వైరస్ ఎన్నో లక్షలమంది ప్రజలకు వ్యాపించింది. ఎన్నో వేలమందిని అత్యంత దారుణంగా చంపేస్తుంది. ఇంకా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు ఎన్నో జాగ్రత్తలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో ప్రజలంతా వణికిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వలు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. మరెన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ ప్రజలు బయటకు రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. రూల్స్ అతిక్రమించినందుకు పోలీస్ కేసు పెట్టి జైలులో వేస్తున్నారు. ఇలా దేశమంతా కఠిన నిర్ణయాల మధ్య నలిగిపోతున్న సమయంలో చినజీయర్ స్వామి వరల్డ్ పీస్ ప్రేయర్ చేస్తున్నారు.
శంషాబాద్లోని ముచ్చింతలలోని ఆశ్రయంలో రేపు ఉదయం 10 నుంచి విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభం కానుంది. కరోనా వైరస్ కు బ్రేక్ వేసేందుకు నేటితో ముగియనున్న వికారి నామసంవత్సరం ప్రపంచం శాంతియుతంగా ఉండాలి.. ఈ వ్యాధి తగ్గిపోవాలి అని విష్ణు సహస్రనామ ప్రయాణం చేస్తున్నారు.
మరి వరల్డ్ పీస్ ప్రేయర్ కరోనా వైరస్ ను తరిమికొడుతుందా? ఇప్పటికే ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇంటికి పరిమితం చేసిన ప్రభుత్వాలకు మించి ఈ ప్రేయర్స్ పని చేస్తాయా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ప్రేయర్స్ ఎంతమాత్రం పని చేస్తాయి అనేది చూడాలి.