టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలకృష్ణ మరియు వెంకటేష్ వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోలకు పోటీగా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకపక్క హీరోలకు క్యారెక్టర్ సపోర్టింగ్ పాత్రలు చేస్తూ మరో పక్క తన సినిమాలు తను చేసుకుంటూ వెంకటేష్ సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో వెంకటేష్ ఒకేసారి తన రేటు పెంచటంతో నిర్మాతలు వణికిపోతున్నారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోలలో బాలకృష్ణ సినిమా కి వచ్చి దాదాపు 9 నుండి 10 కోట్లు ఈజీ గా తీసుకోవడం జరుగుతుంది. కానీ వెంకటేష్ మరియు నాగార్జున అయితే సినిమాకి వచ్చే మొన్నటివరకు 5 నుంచి 6 కోట్లు మధ్య రెమ్యూనరేషన్ తీసుకునే వారు.

 

మెగాస్టార్ విషయానికి వస్తే ఆయన రేంజ్ వేరు. ఇటువంటి పరిస్థితుల్లో వెంకటేష్ ఒక్కసారిగా తన రేటు పెంచేశారు. ఎఫ్ 3, వెంకీ మామ తరువాత నారప్ప సినిమా చేస్తున్నారు వెంకీ. ఈ సినిమా మీద కాస్త అంచనాలు వున్నాయి. ఈ టైములో దిల్ రాజు మరియు అనిల్ రావిపూడి కలసి ఎఫ్ 3 ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సినిమాకి వెంకీ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించాల్సి ఉంది.

 

ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో షేర్ కావాలనే దగ్గర బేరం ప్రారంభించారు వెంకీ సోదరుడు సురేష్ బాబు అని ఇండస్ట్రీలో టాక్. అయితే వారం చివరాఖరికి 10 కోట్ల రెమ్యూనరేషన్ వరకు వచ్చినట్లు చివరాఖరికి 10 కోట్లు లోపే సెట్ అయింది అని ఇండస్ట్రీలో టాక్. ఆ తర్వాత సినిమాలకు మాత్రం ఇక రెమ్యూనిరేషన్ పది కోట్లే అన్నది ఇండస్ట్రీ టాక్. దీంతో వెంకీ రేటు పెంచడంతో ఇండస్ట్రీలో నిర్మాతలు రేటు వణికిపోయినట్టు ఉంది గా అని కామెంట్స్ చేస్తున్నారట.  

మరింత సమాచారం తెలుసుకోండి: