మహిళలపై రోజురోజుకూ లైంగిక దాడులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు  అతి దారుణంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలపైనా  లైంగిక దాడులు చేస్తూ అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఉరిశిక్ష విధించిన ఎవరి లో మార్పు మాత్రం కనిపించడం లేదు. వెరసి రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి దారుణం ఘటన చోటుచేసుకుంది

 

 

 యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 17వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన 19 ఏళ్ల యువతి ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసింది. అయితే ఆ యువతి కి నాకు పూర్ జిల్లాలోని ఖుహి  పట్టణానికి చెందిన యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. కొన్ని రోజులకే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఇటీవలే పరీక్షలు ముగియడంతో మార్చి 17వ తేదీన ఖుహి  పట్టణానికి వెళ్ళింది సదరు యువతి. ఇక అక్కడ వీరిద్దరూ కలవగా బైక్ పై  బయల్దేరారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో బైక్ ఆగిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో... అటు వైపు వస్తున్న ఐదుగురు యువకులు వీరిద్దరిని చూసి ఆగారు. 

 

 

 అటవీప్రాంతం కావడంతో వారి  కామం  కాస్త కట్టలు తెచ్చుకుంది. దీంతో సదరు యువకున్ని కొట్టి మరి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి  యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వదిలేయాలని యువతి వేడుకున్న విడిచిపెట్టలేదు. గ్యాంగ్ రేప్ చేయడమే కాదు ఏకంగా దాన్ని వీడియో తీశారు. అత్యాచారం అనంతరం బాధితురాలు అక్కడే వదిలేసి వెళ్లిన  వారు ... ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తాం  అంటూ బెదిరించాడు. ప్రియుడి  సాయంతో ఇంటికి చేరుకున్న బాధితురాలు నాలుగు రోజుల తర్వాత ధైర్యం చేసుకుని పోలీసులు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే అదే ప్రాంతంలో గతంలో కొంత మంది పై ఈ గ్యాంగ్  అకృత్యాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: