దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో ప్రధాని మోదీ దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా పూర్తిగా కనుమరుగు కాకముందే హంటా వైరస్ వచ్చేసింది. చైనాలో హంటా భారీన పడి ఒక వ్యక్తి చనిపోవడంతో ప్రపంచ జనాభా భయభ్రాంతులకు గురవుతోంది. చైనాలో పుట్టిన ఈ హంటా వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉండటం గమనార్హం. 
 
దాదాపు 4 లక్షల మంది కరోనా భారీన పడగా 17,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో హంటా వైరస్ ప్రజల మీద దాడి చేయడానికి సిద్ధమైంది. చైనా ప్రజలు ఎలుకలు తింటారనే విషయం తెలిసిందే. ఎలుకల్ని తినడం వల్ల ఈ వైరస్ భారీన చైనాలో చాలా మంది పడ్డారని సమాచారం. 
 
ఒక వ్యక్తి ఈ వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే మరణించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. చైనా కొత్త వైరస్ గురించి గోప్యత పాటించినా ఒకరు వైరస్ భారీన పడి మృతి చెండంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ లో ఈ వైరస్ పుట్టినట్లు తెలుస్తోంది. కరోనా కంటే ఈ వైరస్ మరీ డేంజర్ కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
వైరస్ సోకిన వ్యక్తి కొన్ని గంటల్లోనే మృతి చెందడంతో ప్రజలందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చైనాలో వైద్యులు సూచిస్తున్నారు. కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. తాజాగా ఈ వైరస్ మరింత డేంజర్ అంటూ వస్తున్న వార్తలు ప్రజల్ని టెన్షన్ పెడుతున్నాయి. ప్రజలు కచ్చితంగా శుభ్రత పాటించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ ల భారీన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: