ఒడిశా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన వారానికే నవ వధువు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన రోజు నుండి భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని యువతి సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో షాక్ అవడం స్థానికుల వంతయింది. యువతి పెళ్లైన మరుసటిరోజే భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి మృతితో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే గజపతి జిల్లా చంద్రగిరి మండలం హఠొపొదవీధిలో వారం రోజుల క్రితం పంకజ్ నాయక్ కు గంజాం జిల్లా అస్కా ప్రాంతానికి చెందిన సమీర్‌జెన్నాకు వివాహం జరిగింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ప్రేమగా చూసుకున్న పంకజ్ పెళ్లైన మరుసటి రోజు నుంచే చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. 
 
భర్త వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందనే విషయం తెలిసి పంకజ్ ఇంటి నుంచి పారిపోయాడు. పంకజ్ ను పెళ్లి చేసుకొని మోసపోయానని భావించి యువతి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుంది. ఇంటి నుండి పొగలు వస్తూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు యువతి మృతి చెందింది. పోలీసులు యువతి రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. భర్త టార్చర్ భరించలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని యువతి లేఖలో పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పంకజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.                 
     

మరింత సమాచారం తెలుసుకోండి: