ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అత్యవసర పరిస్థితుల్లో తప్ప, ప్రజలు బయటకు రావొద్దని ప్రధాని ఆదేశాలు జారీ చేసారు. ఇక ఈ లాక్ డౌన్ దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయితే ఏదో ఒక రోజు, రెండు రోజులు అంటే ఇంట్లో ఉండగలరు. కానీ ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం ప్రజలు టీవీలో సినిమాలు, షోలు, సీరియల్స్ చూసుకుంటున్నారు.

 

ఇక కొంతమంది సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతున్నారు. కానీ కొంతమంది ప్రబుద్ధులు మాత్రం పోర్న్ సైట్స్ మాత్రం పడ్డారు. మాములుగా ఇండియాలో చాలా పోర్న్ సైట్స్ బ్యాన్ చేసారు. కానీ మనోళ్లకు తెలివితేటలు ఎక్కువ కదా...అందుకే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్(VPN), మిర్రర్ సైట్స్ లాంటి వాటి ద్వారా పోర్న్ సైట్స్‌లోకి వెళ్లి వీడియోలను చూస్తున్నారు.

 

ప్రపంచంలో భారతీయులే ఎక్కువ పోర్న్ వీడియోలని చూస్తున్నారని, ప్రముఖ అడల్ట్ ఎంటర్టైనర్ సంస్థ ఒకటి వెల్లడించింది. తమ సైట్ కు ఇండియా నుంచే ఎక్కువ ట్రాఫిక్ వస్తోందని తెలిపింది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న మార్చి నెలలో ఎక్కువ ట్రాఫిక్ ఉందని, ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో దాదాపు 20 శాతం ట్రాఫిక్ పెరిగిందని తెలిపింది. 

 

ఈ లాక్ డౌన్ ప్రకటించాక మరింత మంది పోర్న్ సైట్స్ చూస్తున్నట్లు తెలిసింది. ఇక ఇందులో ఎక్కువ మంది ఇండియన్స్.... 'ఇండియన్స్(దేశీ)' వీడియోలను చూస్తున్నారని, ఆ తర్వాత స్థానంలో 'ఓల్డ్&యంగ్','మామ్' లాంటి కేటగిరి వీడియోల్ని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...ఇండియాలో ఉమెన్స్ కూడా పెద్ద ఎత్తున పోర్న్ వీక్షిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద చూసుకున్నట్లైతే ఈ కరోనా ప్రభావంతో ఇండియా వాళ్ళు పోర్న్ సైట్స్ మీద పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: