ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకి రానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు ఈ సినిమా విడుదలను వాయిదా వేసారు. 

 

వాస్తవానికి ఈ సినిమాను జూలై లో విడుదల చెయ్యాల్సి ఉండగా ఆ తర్వాత దసరా కి అని చెప్పారు. మళ్ళీ డిసెంబర్ అనుకుని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని సిద్దం అయ్యారు. వచ్చే ఏడాది ఎలా అయినా ప్రేక్షకుల ముందుకి తీసుకుని రావాలని భావిస్తున్న తరుణంలో వచ్చిన కరోనా సినిమాను బాగా ఇబ్బంది పెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటులు, హీరోలు, హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. కీలక పాత్రల కోసం వారిని ఎంపిక చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో కాసేపు కనపడే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆయన పాత్ర సినిమాను మలుపు తిప్పే విధంగా ఉంటుందని ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను రాజమౌళి డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం చిరంజీవి భారీగానే డిమాండ్ కూడా చేసినట్టు సమాచారం. అందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ లుగా శ్రేయా శరన్, అలియా భట్, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. త్వరలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: