ఏపీ రాజకీయాల్లో కరోనా అంశం కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో ఇప్పుడు ఏ విషయమైనా కరోనా చుట్టూనే తిరుగుతోంది. అందుకే సోషల్ మీడియాలోనూ ఈ అంశమే ట్రెండింగ్ గా ఉంది. అయితే.. వైసీపీ సోషల్ మీడియా కరోనాను జగన్ సర్కారు కట్టడి చేస్తున్న తీరుపై ప్రశంసలు కురిపిస్తూ ముందుకెళ్తోంది. అదే సమయంలో చంద్రబాబు వైఖరిపై మండిపడుతోంది.

 

 

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో ఎక్కడ దాక్కున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. కరోనా ఎఫెక్ట్‌ సమయలో కూడా చంద్రబాబు రాజకీయాలకే పరిమితమయ్యారని... ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నారని అంటోంది. 50 లక్షల మంది చనిపోతారని చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అమరావతి తరలిపోతుందని తన బినామీల కోసం చంద్రబాబు ఫెయిడ్‌ ఆర్టిస్టులతో కృత్రిమ ఉద్యమం నడిపిన చంద్రబాబు..కరోనాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తోంది.

 

 

అంతే కాదు.. గతంలో ఎన్నడూ బయటకు రాని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మణి అమరావతి ఉద్యమం కోసం బయటకు వచ్చిన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా గుర్తు చేస్తోంది. అమరావతి ఉద్యమం కోసం చంద్రబాబు భార్య భువనేశ్వరి తన ప్లాట్లినమ్‌ గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి గుర్తు చేస్తూ... మరి ప్రజలు భయంతో వణికిపోతున్న కరోనా నివారణకు మాత్రం వీరికి దానం చేసేందుకు చేతులు రావడం లేదని ప్రశ్నిస్తోంది.

 

 

ఏపీలో జనం ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో చంద్రబాబు హాయిగా కాలం వెల్లదీస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా విమర్శిస్తోంది. రాష్ట్రంలోని వాలంటీర్‌ వ్యవస్థపై ప్రశంసల జల్లులు కురుస్తుంటే చంద్రబాబు వాలంటీర్ల సేవలను గుర్తించడం లేదని మండిపడుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: