ఇప్పుడు ప్రపంచంలోని వందలాది దేశాలు కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి అంటే అది చైనా వాళ్ళ పుణ్యమే. ఇష్టమొచ్చిన జంతువులను ఆహారంగా తీసుకోవడమే కాకుండా వాటిని భుజించే పద్ధతిలో కూడా శుభ్రత పాటించకుండా ఒక కొత్త వైరస్ బయటకు రావడానికి కారకులైన చైనీయులను ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఒక్క మనిషి తలుచుకోకుండా లేడు అంటే అతిశయోక్తి కాదు. దాదాపు రెండు నెలలు కొన్ని వేలాది ప్రాణాలు కోల్పోయిన చైనా దేశం ఎట్టకేలకు కుదుటపడింది.

 

గడిచిన మూడు రోజుల నుండి చైనాలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. కానీ ఇటు చూస్తే భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700 కి సమీపిస్తుండగా.. ఇటలీలో సగటున రోజుకి 600 మంది చనిపోతున్నారు. ఇక ఇరాన్, ఫ్రాన్స్, స్పెయిన్ మరియు అమెరికాలో రోజుకు వేలాది మంది కరోనా వైరస్ బారిన పడుతూ ఉండగా అక్కడ కూడా కనీసం రోజుకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 

ప్రపంచంలోని దేశాలన్నింటికీ ఇంతటి దుస్థితిని పట్టించిన చైనా చాలా అనూహ్యంగా వైరస్ బారి నుండి బయటపడడం ఎప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆర్థిక మాంద్యం నుంచి బయట పడేందుకు చైనీయులు వైరస్ ను ఏమీ బయటికి వదలలేదు కదా అన్న కొత్త అనుమానాలు కూడా వస్తున్న సమయంలో చైనా విదేశీ మినిస్ట్రీ ఒక సంచలన ప్రకటన చేసింది.

 

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడడంతో తన దేశంలోకి ఒక్క విదేశీయుడిని తాము అనుమతించబోమని వారు చెప్పారు. అసలు అన్ని దేశాలలో పరిస్థితి రావడానికి కారణమైన వారే ఇప్పుడు మిగతా దేశాలను వెలివేస్తుంటే అసలు వీరిని ఏమనుకోవాలి అని ప్రజలంతా కోపంతో ఊగిపోతున్నారు. చైనీయులకి అసలు మనస్సాక్షి లేదంటూ రగిలిపోతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: