కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడిపోతుంది. దాన్ని ఏ విధంగా అదుపులోకి తీసుకురావాలి అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి. కరోనా వైరస్ ని కట్టడి చేయడం అర్ధం కాక ఇప్పుడు కొన్ని దేశాలు ఇక ఆశలు కూడా వదిలేసినట్టు తెలుస్తుంది. కరోనా వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమని చాలా మంది అంచనా వేయలేక దాన్ని చాలా వరకు లైట్ తీసుకున్నారు. ఇప్పుడు దాని ప్రభావం అర్ధమయ్యే సరికి ఎక్కడి వాళ్ళు అక్కడ జాగ్రత్త పడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది.
ఇది పక్కన పెడితే ఇప్పుడు కరోనా వైరస్ ఉన్న నేపధ్యంలో ఇంటి యజమానులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 8 లోపు అద్దె ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇంటి అద్దెను వాయిదా వేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళు ఇల్లు అద్దె కట్టే పరిస్థితి ఉండదని సహకారం అందించాలని కేంద్రం కోరే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం కరోనా విరస్ తీవ్రంగా ఉంది. ఇప్పట్లో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే అవకాశం కూడా లేదు కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించాలని కోరే అవకాశాలు ఉన్నాయి.
ఇక మన దేశంలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 700 కి చేరువలో ఉంది కరోన బాధితుల సంఖ్య. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కట్టడి లోనే ఉందని అది రెండో దశలోనే ఉందని అంటున్నారు. కాస్త కఠినంగా ఉంటే తగ్గుతుందని అంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple