కరోనా బూచి భయపెడుతోంది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి.. అసలే లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. వాళ్లకు అన్ని సౌకర్యాలు ఉంటున్నాయా లేదా తెలుసుకోవాలి. ఇదే కదా ప్రజాప్రతినిధి అసలు కర్తవ్యం. ఇలాంటి కష్ట కాలంలోనే కదా నాయకుల అవసరం. కానీ ఈ సమయంలో ప్రజలను వదలి ఎక్కడో కూర్చుంటే ఆ నాయకుడిని ఏమనాలి..?
ఇదే ప్రశ్న అడుగుతున్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఎవరిని అంటారా.. ఇంకెవరిని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును. వైసీపీఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ... ప్రజలకు దైర్యం చెబుతూ లాక్ డౌన్ ను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన నియోజకవర్గం కుప్పాన్ని... రాష్ట్రాన్ని గాలికొదిలేశారని రోజా మండిపడ్డారు. ఆయన కుప్పం వదిలేసి... హైదరాబాద్ లో కూర్చున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలం .. తాము కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలకు అవగాహన పెంచుతూ నియోజకవర్గాలలో తిరుగుతున్నామని రోజా అంటున్నారు. కాని చంద్రబాబు మాత్రం హైదరాబాద్ లో కూర్చుని అన్ని లక్షల మంది చచ్చిపోతారు.. అంటూ పిచ్చి ప్రచారం చేస్తున్నారని ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం ప్రజలను గాలికి వదలి హైదరాబాద్ లో ఉంటారా అని చంద్రబాబును నిలదీశారు.
చంద్రబాబు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని రోజా సూచించారు. రోజా విమర్శించిందని కాదు కానీ.. చంద్రబాబు వంటి అనుభవజ్ఞడైన నేత ఇలాంటి కష్ట కాలంలో రాష్ట్రం వదిలేసి కేవలం ప్రెస్ మీట్లు, ఉత్తరాలు రాసుకుంటూ కూర్చోవడం అంత సబబుగా అనిపించడం లేదు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle
https://tinyurl.com/NIHWNapple