కొంత మందికి ప్రపంచం మునిగిపోతున్నా తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అంటుంటారు. ఓవైపు కరోనా భయంతో ప్రపంచమంతా అట్టుడుకుతుంటే కొన్ని విద్యాసంస్థలు మాత్రం అదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాలే అన్ని రకాల పరీక్షలు వాయిదా వేస్తూ.. తర్వాత చూసుకుందామని ప్రకటిస్తుంటే వీరు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.

 

 

దేశమంతటా లాక్ డౌన్ ఉంది. కేంద్రం ప్రకటించింది. అంతకుముందే రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించింది. సిట్యుయేషన్ ఇంత సీరియస్ గా ఉంటే.. కొన్ని విద్యాసంస్థలు విచిత్రంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్క విద్యా సంస్థ కూడా పనిచేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా... ప్రకాశం జిల్లాలో ఒక కాలేజీలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఏకంగా ఆ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

 

 

ఇంతకీ ఆ కాలేజీ ఎక్కడ అంటారా.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఉంది. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్లంకొండ కళాశాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం గ్రామ మహిళా పోలీసు కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడి కాలేజీ నడపవద్దని చెప్పారు కూడా . అయినా ఆ కాలేజీ యాజమాన్యం దాన్ని ఖాతరు చేయలేదు.

 

 

ఓ రెండు రోజుల పాటు కళాశాల మూసేసినా.. ఆ తరవాత మళ్లీ యథావిధిగా తెలిచారు. దీంతో తిక్కరేగిన ఆ మహిళా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులు ఈ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అయినా ప్రపంచమంతా కరోనాతో వణుకుతుంటే.. ఇప్పుడు వీళ్లు కాలేజీ పెట్టి ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారో ఏమో అంటున్నారు స్థానికులు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: