మనం గత రెండు రోజులుగా సోషల్ మీడియా లోని కొన్ని వీడియోలను గమనించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చాలా మంది లాక్ డౌన్ చాలా లైట్ గా తీసుకున్నారు. అసలు మూడు వారాలు దేశంలోని కార్యకలాపాలు అన్నీ స్థంభించేలా కేంద్రం సంచలన నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్న కనీస అవగాహన కూడా జనాలకు లేకుండా పోయింది. బయటికి వస్తే మీరు పోవడమే కాకుండా పక్కవారిని కూడా ఆపదలో పెడతారు అని చెప్పినా కూడా జనాలు ఎవరి మాటలు వినట్లేదు.

 

IHG

 

ఒకవైపు పోలీసులు లాఠీలు విరిగేలా కొట్టినా వినట్లేదు... ఇంటికి వెళ్లి లోపలే ఉండండి అని సలహా ఇచ్చినా వినట్లేదు.... రెండు చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నా వినట్లేదు. దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలు మాట వినకుండా బయటికి వస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం కేంద్రం మొత్తం రంగం సిద్ధం చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బయటకు వస్తున్న నగరాల్లో మరియు గ్రామాల్లో పారామిలిటరీ బలగాలు దించేందుకు కేంద్రం సిద్ధమయ్యింది.

 

IHG

 

ప్రత్యేకంగా కొన్ని నగరాల్లో మరియు గ్రామాల్లో ప్రజలు లాక్ డౌన్ పాటించకుండా పోలీసులకే ఎదురు తిరుగుతుంటే విషయమై కేంద్రం జగన్ మరియు కేసీఆర్ కి ఇప్పటికే సమాచారం అందజేశారట. ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత బలగాలను దింపనున్నారు. కేంద్ర హోం శాఖ మేరకు నిర్ణయం తీసుకుంది. బయటకు వస్తే మాత్రం ఇక నుంచి కచ్చితంగా అరెస్ట్ చేసి వారిని జైలుకి కూడా పంపాలని సెంట్రల్ జైలు కి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. సరైన కారణం లేకపోతే మాత్రం ఇక క్షమించేది లేదని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: