కరోనా వైరస్ ప్రపంచంలో విలయతాండవం చేస్తుంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద చాలా వందకు పైగా దేశాలలో విస్తరించి ఉంది. బాగా అభివృద్ధి చెందిన అమెరికా మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ ఇలాంటి దేశాలు నిలవలేక పోతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టడానికి తలా బాదుకుంటున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువ అవటం మరోపక్క మరణాల సంఖ్య కూడా పెరగడంతో అమెరికా దేశంలో ప్రజలలో భయాందోళన నెలకొంది. ఇటలీ దేశమైతే మొత్తం అంతా శవాల దిబ్బగా మారింది. ఆ దేశంలో ఉన్న ఆర్మీ చనిపోయిన వాళ్లను ఖననం చేయడానికి ఒక మిలటరీ వాహనంలో వందమంది శవాలను తీసుకెళ్తున్నారు. అంత దారుణంగా పరిస్థితి మారింది ఇటలీలో.
ముఖ్యంగా ఇటలీ దేశ అధికారులు ముందు చెప్పిన సూచనలు మరియు హెచ్చరికలు పాటించక పోవడం వల్లే ఈ పెను విషాదం మరణ విలయ తాండవం జరిగిందని ప్రస్తుతం బాధపడుతున్నారట. రోజురోజుకీ కేసులు పెరగటం తో ఇప్పుడు ఇతర దేశాల వైపు సహాయం కోసం ఎదురు చూసే దుస్థితికి చేరిపోయింది ఇటలీ. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రజలు శవాల మధ్య బతుకుతున్నారని గ్రౌండ్ రిపోర్టులో తేలింది.
ఇటువంటి ఇటలీ దేశంలో ప్రస్తుతం చదువు కోసం వెళ్లిన 350 మంది భారతీయ విద్యార్థులు విమాన రాకపోకలు ఆగిపోవటంతో ఏం చేయలేని స్థితిలో ఇరుక్కు పోయారు...తమ చుట్టూ ఉన్న వారికి ఒక్కొక్కరికి పాజిటివ్ కేసులునమోదు అవుతుంటే.. తమకు భయం వేస్తుందన్నారు. తాము ఇక్కడ మరణిస్తే.. తమ డెడ్ బాడీస్ ను భారత్ కు పంపరని చెబుతున్నారని.. ఇలాంటివేళ.. తమ వేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదన్నారు. ఈ క్రమంలో తెలుగు రాజకీయ నేతలు ఆదుకోవాలని కోరుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple