కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్నా తమను మాత్రం అడ్డుకోలేదని ఓ ప్రేమికుడు.. ప్రేయసి ఫ్రూవ్ చేసుకున్నారు. కరోనా వైరస్ ఉందా లేదా ? అని నిర్దారణ చేసుకునే క్రమంలో ఆసుపత్రిలో ఉన్న ఓ యువకుడు తన ప్రేయసితో సహా పరారై పోయాడు. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అయితే పోలీసులు ఎట్టకేలకు వీరిని పట్టుకున్నారు. తమిళనాడులోని శివగంగైకు చెందిన విజయ్ విదేశాల్లో ఉంటున్నాడు. అతను మదురైకి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. విదేశాల నుంచి రాగానే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు మాత్రం ఈ ప్రేమ ఇష్టం లేదు.
ఆ యువతికి మరో యువకుడితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు నేరుగా విదేశాల నుంచి రాగానే తన ప్రేయసిని దక్కించుకుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు. అయితే ముందుగా మధురై విమానాశ్రయంలో అధికారులు అతడికి పరీక్షలు చేసి క్వారంటైన్లో ఉంచారు. అయితే కరోనా నిర్ధారణ నిమిత్తం అతని రక్త నమూనాలను పరిశోధనకు పంపించారు. అయితే సదరు యువకుడు ఈ పరీక్షల నమూనాలు రాకుండానే అక్కడ నుంచి తప్పించుకుని తిరుపరంగుండ్రంలో ఉన్న ప్రేయసిని చేరుకుని ఇద్దరు కలిసి పారిపోయారు.
ఆసుపత్రిలో ఉన్న యువకుడు కనిపించకుండా పోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. చివరకు వాళ్లు డాక్టర్లపై సీరియస్ అయ్యారు. శుక్రవారం ఉదయం అక్కడ ఒక్క సారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. చివరకు అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా అతడు శివగంగైకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడి ప్రేయసిని సైతం కరోనా పరీక్షలకు తరలించారు. ఇక ఇటు తమ కుమార్తె కనిపించడం లేదంటూ యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తమ కుమార్తెను తీసుకుని పరారైన యువకుడి తల్లి, సోదరుడిపై యువతి బంధువులు దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple