కరోనా వైరస్తో ప్రపంచ ప్రజలంతా మృత్యువాత పడుతూ భయభ్రాంతులతో భయపడుతున్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏదో విధంగా వ్యాధి బయటకు వచ్చేస్తోంది. ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్ధం కాని పరిస్థితులు మొత్తం ప్రపంచమంతటా నెలకొన్నాయి. ఇక ఈ వ్యాధి చైనా నుండి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త అక్కడ వ్యాధి తగ్గుముఖ్యం పట్టిందని ఓ పక్క వార్తలు వస్తుంటే కాస్త పర్వాలేదంటూ అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్న నేపధ్యంలో మళ్ళీ చైనాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా మళ్ళీ చైనాదేశంలో కోరలు చాచిందని చెప్పాలి. గురువారం 55 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీళ్లలో 54 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, ఒకరికి మాత్రం స్థానికంగా వైరస్ సంక్రమించిందని తెలిపారు.
మూడు రోజులు తర్వాత జేజియాంగ్ ప్రావిన్స్లో ఈ కేసు నమోదైందన్నారు. దీంతో మళ్లోసారి కరోనా అడుగుపెట్టకుండా ఆ దేశం కట్టడి చర్యలు మళ్ళీ మొదలుపెట్టింది. ఫారినర్ల ను వాళ్ళ దేశంలోకి రాకుండా కట్టడి చేస్తుంది. వీసాలను క్యాన్సిల్ చేసింది. ఫ్లైట్లను చాలా వరకు తగ్గించింది. మార్చి 28 వరకు వీటిని అమలు చేస్తున్నామంది. కొత్తగా వీసా కావాలనుకుంటే స్థానిక చైనా ఎంబసీల్లో అప్లై చేసుకోవాలని చెప్పింది. అంతేకాక రెసిడెన్షియల్ పర్మిట్ ఉన్న వాళ్లకు కూడా అనుమతి లేదని తేల్చి చెప్పింది. గురువారం హుబెయ్ ప్రావిన్స్లో ఐదుగురు చనిపోయారని అక్కడి హెల్త్ కమిషన్ వెల్లడించగా.. విదేశాల నుంచి వస్తున్న కేసుల్లోనూ చైనీయులే ఎక్కువ మంది ఉన్నారని.. వాళ్లు ఎక్కువగా ఇటలీ, యూరప్ దేశాల నుంచి వస్తున్నారని తెలిపింది.
ఇప్పుడిప్పుడే కాస్త తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ తిరిగి చైనాలో కరోనా తిరబెడుతోంది. కోలుకున్న వారిలో 3 నుంచి 10 శాతం మందికి మళ్లీ పాజిటివ్ కేసులుగా నమోదయింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే మళ్లీ వ్యాధి వచ్చిన వాళ్ల నుంచి వేరే వాళ్లకు సోకుంతుందా లేదా తెలియదని పేర్కొంది. ఓ హాస్పిటల్లో 145 మందికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టుల్లో ఐదుగురికి మళ్లీ వైరస్ తిరగబడిందని టెస్టుల ద్వారా వెల్లడైంది. అయితే వాళ్లలో కరోనా లక్షణాలేవీ కనబడలేదని, వాళ్లలో క్లోజ్గా కాంటాక్టయిన వాళ్లకూ పాజిటివ్ రాలేదని చెప్పింది. మరోవైపు వుహాన్లోని క్వారంటైన్ సెంటర్లలోని రికవరైన 5 నుంచి 10 శాతం మందికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది.
ఇక దక్షిణాఫ్రికాలో దేశమంతా మిలిటరీ పెట్రోలింగ్ ని చాలా జాగ్రత్తగా చేస్తోంది. కర్ఫ్యూను కఠినంగా ఓంతో బాధ్యతతో అమలు చేస్తోంది. 5.7 కోట్ల మంది ఇండ్లల్లోనే ఉండాలని అధికారులు చాలా కఠినంగా ఆదేశించారు. దక్షిణ ఆఫ్రికాలో మూడు వారాల లాక్డౌన్ శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కరోనాతో అల్లాడుతున్న ఇరాన్లో అక్కడి ఆర్మీ 2 వేల పడకల తాత్కాలిక ఆసుపత్రిని తెహ్రాన్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారట.