టాలీవుడ్ లో ఒక ప్రముఖ హీరోయిన్ కి కరోనా సోకిందని శుక్రవారం టాక్ రావటంతో మీడియాలో ఈ వార్త గురించి చక్కర్లు కొట్టింది. ఇవి తెలుసుకున్న ఆ టాలీవుడ్ హీరోయిన్ ఈ వార్తపై స్పందించింది. తనకు కోనా వైరస్ సోకలేదని నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని క్లారిటీ వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు లెజెండ్ సినిమాలో బాలయ్య సరసన నటించిన హీరోయిన్ రాధిక ఆప్టే. అయితే.. ఈమె తాజాగా ఓ ఆసుపత్రిలో తన ముఖానికి మాస్క్‌ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది.

 

దీంతో ఆ ఫోటోను చూసిన వారు ఆమెకు కరోనా వచ్చిందంటూ పుకార్లు పుట్టించారు. దీంతో ఈ వార్త నిమిషాల్లో వైరల్ అయింది. దీంతో ఆమె ఒక సెలబ్రిటీ కావటంతో మీడియాలో కూడా టాక్ వచ్చింది. స్పందించిన రాధికా ఆప్టే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపింది. అలాగే తాను ఎటువంటి పరీక్షలు చేపించుకోలేదని చెప్పింది. కానీ ఆమె ఎందుకు ఆసుపత్రికి వెళ్లిందన్న విషయంపై మాత్రం ఈ భామ క్లారిటీ ఇవ్వలేదు.

 

అయితే.. రాధికా ఆప్టే మాత్రం లాక్ డౌన్ ప్రకటించారు కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండి, జాగ్రత్తగా ఉండాలని ఈ బ్యూటీ తన అభిమానుల్ని, నెటిజన్స్‌ ను కోరింది. కాగా., రాధికా ఆప్టే తమిళనాడు వెల్లూరులో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. ఆమె చదువుకుంది మొత్తం పూణెలోనే. రాధికా ఆప్టే తన కెరియర్ మొదటలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. 2009లో ఈమె తీసిన బెంగాలి సినిమాతో ఆమెకు స్టార్ డమ్ వచ్చింది. ప్రారంభంలో సినిమా ఛాన్సుల కోసం చాల కష్టపడింది.

 

ఆమె నటించిన మరాఠి సినిమాతో ఆమెకు లక్ కలిసొచ్చింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ భామ ఇప్పటి వరకు ఇప్పటివరకు పలు తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠి, ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: