ప్రపంచా న్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దెబ్బతో ఎన్నో దేశాల్లో ఎంతో మంది ఆకలితో అలమటిస్తోన్న పరిస్థితి. దండిగా డబ్బులు ఉంటే అమెరికా లాంటి దేశాల్లోనే ఏకంగా 30 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో లక్షలాది మంది వలస కూలీలు ఉపాధి లేకపోవడంతో పస్తులు ఉంటున్నారు. నోయిడాలో అయితే పనులు లేకపోవడంతో తమ చిన్న పిల్లలను వెంట పెట్టుకుని నోయిడా జాతీయ రహదారిపైకి వచ్చేశారు.
అక్కడ పోలీసులు తమ స్వరాష్ట్రాలు అయిన యూపీ, బిహార్లకు వెళ్లనీయక పోవడంతో వాళ్లంతా పొట్ట చేత పట్టుకుని విలవిల్లాడుతోన్న పరిస్థితి. చివరకు పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందంటే ఆకలితో ఏడుస్తోన్న పిల్లలకు అక్కడ ఉన్న గడ్డి తినిపిస్తున్నారట. పిల్లలు ఆకలితో అలమటిస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు అలా చేస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలు ఎంత స్ట్రిక్ట్గా లాక్ డౌన్ అమలు చేసినా చాలా మంది రోడ్లమీదకు వస్తున్నారు. మన తెలుగు ప్రజలు సైతం కంట్రోలింగ్ చేసుకోలేకపోతే ఢిల్లీలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనకు కూడా అదే గతి పట్టక తప్పదు. తస్మాత్ జాగ్రత్త తెలుగు ప్రజలు..!
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple