ఒక వ్యక్తికీ ఏం జరిగిందో తెలీదు.. ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే లోపు ఆ వృద్ధురాలు చావు బతుకుల్లో ఉంది. అసలు ఏం జరిగిందంటే.. త‌మిళ‌నాడులో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. 34 ఏళ్ళ వ్య‌క్తి హోమ్ క్వారెంటైన్‌ లో ఉన్నాడు. ఒక్కసారిగా పిచ్చి ప‌ట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తించాడు. అతను ఇటీవల శ్రీలంక నుంచి వచ్చాడు. దీంతో అధికారులు ముందు జాగ్రత్తగా అతడిని హోం క్వారంటైన్‌ లో ఉంచారు.

 

తర్వాత అతను ఆ రాత్రి త‌న‌ ఇంట్లో హోమ్ క్వారెంటైన్ నుంచి త‌ప్పించుకుని దుస్తులు లేకుండా నగ్నంగా వీధుల్లోకి ప‌రుగులు తీశాడు. అక్కడే ఆరు బ‌య‌ట పడుకున్న న‌ట్చి అమ్మాల్ అనే 90 ఏళ్ళ వృద్ధురాలి గొంతును కొరికాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం అయింది. అంతలోపు ఆ వృద్ధురాలి కేక‌లు విని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఇరుగు పొరుగు వారు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసులకు అప్ప‌గించారు. 

 

అనంతరం తీవ్రంగా గాయ‌ప‌డ్డ వృద్ధురాలిని పోలీసుల సాయంతో స్థానిక ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మరణించింది. అయితే.. ఈ ఘటన త‌మిళ‌నాడులోని థేని జిల్లాలో జరిగింది. నిందితుడు వారం రోజుల క్రితమే శ్రీలంక నుంచి స్వ‌గ్రామానికి వ‌చ్చాడు. క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో అధికారులు అత‌డిని 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్‌ లో ఉండ‌మ‌ని ఆదేశించారు.

 

దీంతో వారం రోజులుగా హోమ్ క్వారెంటైన్‌ లో ఉన్న అత‌డు శుక్ర‌వారం రాత్రి ఉన్న‌ట్టుండి ఒక్కసారి పిచ్చి ప‌ట్టిన‌ వాడిలా చేశాడని చుట్టుపక్కల స్థానికులు తెలిపారు. అలాగే శ్రీలంక నుంచి వచ్చిన దగ్గర్నుంచి అతడి మానసిక స్థితి సరిగా లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యక్తి తీరుతో ఓ అమాయ‌క వృద్ధురాలి ప్రాణం తీశాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: