ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. రోజురోజుకు ఎన్నో ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. మూడో అక్ష‌రాల ఈ క‌రోనా నేడు ప్రపంచాన్ని తన అరచేతిలో ఉంచింది. చాలా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడు దాని ముందు మోకరిల్లాయి. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావంతో ఇటలీ విలవిల్లాడుతోంది. ఈ యూరోపియన్ దేశంలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో అంతకు అంతకూ పెరుగుతోంది. ఇక ఈ కరోనా వైరస్ భారత్ లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మెల్లగా ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా క్రమేపీ వేగంగా పెరుగుతూ వస్తోంది.

 

 కొద్దిరోజుల క్రితం వరకు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ప్రజలు తాజాగా స్వచ్ఛందంగా సూచనలు అమలు చేస్తూ శభాస్ అనిపించుకుంటున్నారు. తాజాగా  ఓ గృహిణి తన భర్తకు కరోనా పరీక్షలన్నీ పూర్తయ్యాకే కాపురం చేయాలంటూ షరతు పెట్టింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చిన భర్తను దూరం పెట్టిందో భార్య. కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లో అడుగుపెట్టాలని సూచించింది. 

 

లేకపోతే పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఉందని, తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని భర్తకు వివరించింది.  అయినా భర్త వినకుండా వైద్య పరీక్షలు చేయించుకోలేదు. ఈ విషయమై.. ఇద్దరి మధ్య గొడవ జరిగి అది పోలీస్ స్టేషన్ మెట్లెక్కేందుకు కారణమైంది. స్పందించిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఏదేమైనా  కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో పెరిగిన అవగాహనకు ఈ ఘటన ఓ సాక్షంగా న‌లిస్తుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే అంద‌రూ కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఈ ర‌క్క‌సి క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: