కరోనా దెబ్బతో ప్రజలందరిలోనూ ఒకరకమైన సందేహం వచ్చేసింది. అసలు కరోనా వైరస్ అనేది ముందుగా చైనాలోని వుహాన్ నగరంలోని జంతువుల మాంసాహార మార్కెట్లు పుట్టడంతో అసలు మాంసం తినకూడదు... మాంసం వల్లే ఈ వైరస్ వస్తుందన్న ప్రచారం అయితే బాగా జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మాంసం డిమాండ్ బాగా పడిపోయింది. అయితే ఇది అపోహే అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. కరోనా అనేది రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారిలోనే ఎక్కువుగా వైరల్ అవుతోందని.. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వృద్ధులే కరోనా భారీన పడి చనిపోతున్నారన్న టాక్ ఉంది.
ఈ క్రమంలోనే ఏఐజీ హాస్పటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఓ మీడియా సంస్థతో పంచుకున్న అనుభవాల ప్రకారం కరోనాని చికెనన్ తిని జయించ వచ్చని సూచించారు. విటన్ మిన్ సీ, ఈలతో కరోనా పారిపోతుందని ఆయన చెపుతున్నారు. ఈ రెండు విటమిన్లకు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు వైరస్ శరీర కణాలను నాశనం చేయకుండా చేయడంలో తోడ్పడతాయని చెపుతున్నారు. అందుకే విటమిన్ సీ, ఈ ఎక్కువుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆయన చెపుతున్నారు.
క్యారట్, ఆకుకూరల్లో పుష్కలంగా బి విటమిన్ ఉంటుంది. మన పొట్ట శ్వాసనాళం బాగా పని చేయడానికి బి విటమిన్ అవసరం అని అలాగే.. ఇది చర్మం ఉజ్జీవంగా ఉండేందుకు అవసరం అవుతుందని చెపుతున్నారు. ఇక సముద్ర చేపలు, గుడ్లు వెన్న బాదం పిస్తా, పప్పు ధాన్యాలు.. తృణధాన్యాలు శరీరంలో ఆర్మీ బీ 9, బీ6, బీ 12 విటమిన్ల సమృద్ధికి తోడ్పడతాయంటున్నారు. ఇక చేపలు బాగా తినాలని.. చికెన్ కూడా తింటే బలమైన రోగ నిరోధక వ్యవస్థ డవలప్ అవుతుందని ఆయన అంటున్నారు. ఇక చికెన్, మటన్ గుడ్లు సోయా మిల్క్తో పాటు బాదం, పిస్తా జీడిపప్పుడోల సెలెనియం ఉండడంతో అవి కూడా తినాలని ఆయన అంటున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple