స్త్రీ లేదా పురుషుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతోంది. అలాంటి సంబంధం వల్ల తాజాగా ఓ కాపురం కుప్పకూలిపోయింది. తమిళనాడులో నివసించే ఒక మహిళ భర్త కళ్లుగప్పి మరో యువకుడితో వ్యవహారం నడుపుతుంది. ఎందుకు అలా చేసావని నిలదీసిన భర్తను, ప్రియుడితో కలిసి చంపేందుకు ప్రయత్నించింది.  వారి బారి నుంచి తప్పించుకున్నఆ భర్త పోలీసులను ఆశ్రయించడంతో, నిందితులు జైలు పాలయ్యారు.

 

 

వివరాల్లోకి వెళ్తే,  తమిళనాడులోని దిండుగల్ జిల్లా విల్లాంబట్టి సమీపంలోని ముత్తువాసం ప్రాంతంలో రవిచంద్రన్ (47), సెల్వీ (37) దంపతులు నివసిస్తున్నారు.వీరికి పిల్లలు కూడా ఉన్నారు. రవిచంద్రన్ కు బట్టల షాపు ఉన్నందున, అతను రోజూ ఉదయం బయటకు వెళ్లి, రాత్రి పొద్దుపోయాకే ఇంటికి వచ్చేవాడు. సెల్వీ పిల్లల పోషణ చూసుకుంటూ ఇంట్లోనే ఉండేది. కొన్ని రోజుల తర్వాత కథ మలుపు తిరిగింది. ఒకరోజు పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పక్కనే ఉన్న మెడికల్ షాపుకు వెళ్ళింది. అక్కడ ఆమెకు, ఆ మెడికల్ షాప్ ఓనర్ అయిన ఉక్కిరపాండి(27)తో పరిచయం ఏర్పడింది. సెల్వీపై మనసు పడిన అతను, తన కోరిక తీర్చమని ఆమెను అడిగాడు.  సెల్వీ కూడా అందుకు ఒప్పుకుంది. అప్పటి నుండి భర్త షాప్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయిన తర్వాత ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేది.

 

 

ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిసి ఆమెను మందలించారు. కానీ ఆమె వినిపించుకోలేదు. ఆమె వేషాలు శ్రుతిమించడంతో స్థానికుడొకరు రవిచంద్రన్‌కు విషయం చెప్పాడు. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతడు భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. ఇలా ఉండగా, ఒక రోజు రవిచంద్రన్‌కు తన భార్య నగ్నంగా అతని ప్రియుడితో కులుకుతూ కనిపించింది. వీళ్ళ బండారం బయటపెడదామని అతను వీడియో తీసాడు. అది చుసిన వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేసారు. సెల్వీ తన ప్రియుడితో రవీంద్రన్ ను చంపేయమని చెప్పింది. దాంతో అతను తన ఇద్దరు స్నేహితులను పిలిచి రవీంద్రన్ ను చంపుతామని బెదిరించారు. వెంటనే రవీంద్రన్ వాళ్ల దగ్గర నుండి తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం సెల్వీ, ఆ ముగ్గురు యువకులతో కలిసి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: