దెయ్యాల గురించి కొన్ని నిజాలు వింటుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి విషయమే ఒకటి ఈ రోజు తెలుసుకుందాం. ఇది మలేషియాలో జరిగిన ఓ యదార్ధ ఘటన. ఇప్పటికీ ఈ విషయాన్ని అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక పిశాచి దెయ్యం ఒక మనిషితో రెండేళ్ళపాటు కాపురం చేసింది. మనిషిగా పరిచయం చేసుకుని ఒక మనిషిని మోసం చేసి రెండు సంవత్సరాల పాటు అతనితో సంసారం చేసింది. విచిత్రం ఏమిటంటే ఆ వ్యక్తి ఆ దెయ్యాని మనిషిగా ఉన్నప్పుడు గుర్తుపట్టకపోవడమే. వివరాల్లోకి వెళితే... మలేషియా కౌలాలంపూర్ దీనికి దగ్గరలో ఒక చిన్న గ్రామం అక్కడ హలీమ్ అనే ఓ వ్యక్తి. అతడు ఒంటరి చీకులు అమ్ముకుంటూ బ్రతికేవాడు. ఊరి చివర్లో అతని ఇల్లు. ప్రతి రాజు ఊరిలోకి వెళ్ళి చీకులు అమ్ముకుని రాత్రి పూట ఇంటికి వచ్చేవాడు అతను ఊరిలోకి వెళ్ళాలంటే అడవిలాంటి ప్రదేశాన్ని దాటి వెళ్ళివస్తుండాలి. ఒకరోజు రాత్రి చీకులు అమ్మి వస్తుండగా..కొంత దూరం వెళ్ళాక ఉరుములు, మెరుపులు పెద్ద వర్షం. దాంతో ఆ మెరుపుల్లో ఒక అమ్మాయి దూరం నుంచి కనిపించింది. అయితే ఆమె ఎవ్వరు అన్న విషయాన్ని మాత్రం దగ్గరకు వెళ్ళేవరకు కూడా పసిగట్టలేకపోయాడు. అయితే దూరం నుంచి మాత్రం ఆమె చాలా స్పష్టంగా..అందంగా కనిపించింది. ఇక ఆమె అందానికి హలీమ్ ఫిదా అయిపోయాడు. వర్షానికి ఇద్దరూ కూడా అక్కడ దగ్గరలో ఉన్న చెట్టుకింద నిలబడ్డారు.
హలీం ఎవ్వరు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నాడు అని అడిగాడు. దాంతో ఆమె ఏడవడం మొదలు పెట్టింది. ఇక ఆమెను అర్ధం చేసుకున్న హలీమ్ ఆమెను కాపాడదామనే ఉద్దేశంతో ఆమెను మా ఇంటికి వస్తావా అని అడిగాడు. ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళగా అప్పటిని నుంచి ఆమె ఆ ఇంట్లనే ఉంటూ వచ్చింది. ఆమె పేరు సిసా అని చెప్పింది. నాకు ఎవ్వరూ లేరంటూ అతనికి దగ్గరయింది. హలీమ్ కూడా ఒంటరి కావడంతో మంచి తోడు అనుకుని ఆమెకు మరింత దగ్గరయ్యాక ఆమెను వివాహం చేసుకుందామని అనుకున్నాడు. దాంతో ఆమెను అడిగాడు ఆమె ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండేవారు. పగలు ఆమె కాలు బయటకు కూడా పెట్టేది కాదు. రాత్రి సమయంలో అప్పుడప్పుడు మాత్రం బయటకు వెళ్ళివస్తూ ఉండేది.
అలా రెండేళ్ళు గడిచిపోగా ఒక పాప కూడా పుట్టింది. ఒకరోజు అతని ఇంటి పై చుట్టుప్రక్కలవారికి అనుమానం వచ్చింది. అక్కడ ఉండే ఒక అబ్బాయి అనుమానంతో ఇంట్లోకి చూసే ప్రయత్నం చేశాడు. మంత్రించిన నిమ్మకాయను లోపల విసిరే ప్రయత్నం చేశాడు. అలా చూసిన అతనికి వెన్నుపూసలో వణికించే నిజం ఒకటి తెలిసింది. హలీమ్ భార్య పిశాచి అని తెలిసింది. ఆమె స్త్రీ రూపంలో ఉన్న ఒక దెయ్యం అని గమనించి హలీమ్కి చెప్పాడు కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. నేను ఒక పని చేప్తాను చెయ్యి అన్నాడు. నీ భార్య నడినెత్తిలో ఒక మేకు ఉంటుంది నాకు ఇవ్వు అన్నాడు. ఆ విషయం నీకెవ్వరు చెప్పారు అన్నాడు. ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చి ఒకరోజు తన భార్య నిద్రపోతున్న వేళ వెళ్ళి తన నడినెత్తిన చూశాడు మేకు కనిపించింది. దాంతో అతను దాన్ని గట్టిగా పట్టుకుని లాగాడు అంతే ఒకేసారి ఒక నవ్వుతూ ఒక వికృతరూపం తన బిడ్డను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హలీమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇన్నాళ్ళు ఒక పిశాచితో సంసారం చేశానంటూ భయంతో వణికిపోయాడు. మలేషియా కౌలాలంపూర్ దగ్గర జరిగిన యదార్ధ ఘటన.