ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న కరోనా వైరస్ ఒక దేశంలో పేదవాడి నుండి ప్రధానమంత్రి వరకు ఏ తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ దేశాలలో అయితే ఈ వైరస్ విలయతాండవం చేస్తుంది.
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చాలా సులువుగా సంక్రమించే ఈ వైరస్ ను అరికట్టేందుకు చాలా దేశ ప్రభుత్వాలు ఎన్నో విఫలయత్నాలు చేశాయి. ఇక ఏ దారి లేక…. ఏమీ చేసే వీలు లేక ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ చేసి భారతదేశంలో లాగానే ప్రజలందరినీ ఇంటికి పరిమితం కావాలని పిలుపునిచ్చాయి.
అయితే మొట్టమొదటిసారి చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రారంభంలో అక్కడ అ స్వైరవిహారం చేసింది కానీ ప్రస్తుతం చైనా ఆ విపత్కర పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. దానికి కారణం వండర్ డ్రగ్ అనే మందు అని…. అది ఉపయోగించి చైనా దేశానికి చెందిన కరోనా వైరస్ బాధితులకి ఉపయోగించడంతో ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు. సమాచారం అలాగే ఈ డ్రగ్ చైనా దేశానికి.... ప్రపంచ దేశాలకు చెందిన డాక్టర్లకు పంపించే దిశగా మంచి పేరొందిన క్యూబా దేశం ఆ డ్రగ్ ను పంపించి కాపాడినట్లు సమాచారం.
వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశంగా పేరొందిన క్యూబా దేశం మరియు చైనా కమ్యూనిస్టు దేశాలు కావడం వల్ల వారికి మంచి సంబంధాలు ఉండడంతో ఈ మందుని ఉపయోగించుకుని చైనా ప్రభుత్వం కరోనా బారి నుండి బయటపడింది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ మందుని 15 దేశాలకు క్యూబా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భారత్ కూడా ఉంది అని పలువురు చెబుతున్నారు.