కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా కాటేస్తుంది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. కరోనా వైరస్ దెబ్బతో నిరుపేదలు సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు మంత్రులు... ప్రధాన మంత్రులు, అగ్రరాజ్యాల అధ్యక్షులు సైతం గజగజ వణికిపోతున్నారు. చివరకు స్పెయిన్ దేశపు మహారాణి సైతం కరోనా వైరస్ సోకి మృతిచెందారు. ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటిచుట్టూ ఇప్పుడు కరోనా కలకలం వార్తలు రావడం అక్కడ ప్రభుత్వ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
యడియూరప్ప ఇంటి చుట్టు పక్కల కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులు తిరిగినట్లు తెలిసింది. శనివారం కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తుల జాబితా ప్రభుత్వం విడుదల చేశారు. ఇందులో ఎ–59, ఎ–25 నంబర్ కలిగిన వ్యక్తులు సీఎం ఇంటి చుట్టూ తిరగటం అందోళన కలిగిస్తోంది. ఆ ప్రాంతంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులతో పాటు వారి ఇంట్లో పాచి పని చేసిన ఓ మహిళకు సైతం కరోనా సోకినట్టు అధికారులు చెప్పారు.
ఇప్పుడు ఈ కరోనా బాధితుల ఇళ్ల మధ్యలోనే సీఎం యడియూరప్ప నివాసం ఉంటున్నారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఒక మహిళ రోజు డాలర్స్ కాలనీలో నాలుగు ఇళ్లల్లో పాచిపని చేస్తుంది. వీరి ఇళ్ల ముందు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడే సీఎం నివాసం ఉండడం.. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వీరిని బయటకు పంపటంలేదని పోలీసులు తెలిపారు.
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple